
New Delhi, Surya News: ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు (Environmental activist) సోనమ్ వాంగ్ చుక్ (Sonam Wangchuk) భార్య గీతాంజలి ఆంగో దిల్లీ హైకోర్టును (Delhi High Court) ఆశ్రయించారు. సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో (Safdarjung Hospital) తన భర్తను అక్రమంగా నిర్బంధించారని (illegal detention) ఆమె పిటిషన్ లో ఆరోపించారు.
తన భర్తను వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. ఆయనకు చికిత్స అందించిన వ్యక్తిగత వైద్యులు మరియు న్యాయవాదులను కలిసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 21 రోజులుగా కొనసాగుతున్న నిరాహార దీక్షా శిబిరం నుంచి పోలీసులు వాంగ్ చుక్ ను శనివారం సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆసుపత్రిలోనే తన దీక్షను కొనసాగిస్తున్నారని గీతాంజలి ఆంగో తెలిపారు.
చికిత్స విషయంలో ఆసుపత్రి పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ఆసుపత్రిపై తమకు నమ్మకం పోయిందని స్పష్టం చేశారు. డిశ్చార్జ్ చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోరినా అధికారులు నిరాకరించారని ఆమె పేర్కొన్నారు. ఆసుపత్రిలో తనపై కూడా ఆంక్షలు విధించారని చెప్పారు. వంద మందికి పైగా పోలీసులు ఆసుపత్రిలో మోహరించారని, వాంగ్ చుక్ ఉన్న అంతస్తులోనే 30 మంది సిబ్బంది ఉన్నట్లు ఆమె తెలిపారు.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




