|   
🔴 BREAKING NEWS ► NBK 111 Shooting : కాకినాడ పోర్టులో షూటింగ్.. నందమూరి బాలకృష్ణకు ప్రమాదం.. HYDRA Commissioner : సంచలనం.. హైడ్రా రంగనాథ్ అరెస్ట్ కు హైకోర్టు ఆదేశం Indian Railway Jobs : రైల్వేలో కొలువుల జాతర.. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు బిగ్ నోటిఫికేషన్.. జీతం, అర్హతలు ఇవే Delhi High Court : సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో అక్రమ నిర్బంధం.. హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్ చుక్ భార్య Shocking News : అర్ధరాత్రి రోడ్డుపై నగ్నంగా యువతి పరుగులు – చివరిసారిగా దేవుడికి దండం పెట్టుకుని నేరుగా చెరువులోకి
Skip to content

HYDRA Commissioner : సంచలనం.. హైడ్రా రంగనాథ్ అరెస్ట్ కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, సూర్య న్యూస్: హైడ్రా (HYDRA) కమిషనర్ ఏవీ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆయనను అరెస్టు చేయాలని ముందుగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తితో అరెస్ట్ ఆదేశాలను ఉపసంహరించుకుంది.

​ప్రైవేటు భూమిలోకి వెళ్లొద్దన్న ఆదేశాలను మూడుసార్లు ధిక్కరించిన హైడ్రా.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

కమిషనర్ ఏవీ రంగనాథ్ ను అరెస్ట్ చేయాలని హైకోర్టు సంచలన ఆదేశం.

ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తితో అరెస్ట్ ఆదేశాల ఉపసంహరణ.

వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఏవీ రంగనాథ్ (AV Ranganath).

అలవాటుపడ్డ నేరగాడిలా వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.

మల్కాజిగిరి (Malkajgiri) మండలం లోతుకుంటలోని ప్రైవేటు భూమి విషయంలో హైకోర్టు ఆదేశాలను హైడ్రా అధికారులు బేఖాతరు చేశారు. ఈ భూమికి సంబంధించి శాంత శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది. సివిల్ సూట్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది. అయినప్పటికీ ఆ భూమిలో హైడ్రా జోక్యం చేసుకుంటుండటంతో అక్కడికి ప్రవేశించరాదని హైకోర్టు (High Court) హెచ్చరించింది.

కోర్టు ఆదేశించినప్పటికీ మూడోసారి కూడా హైడ్రా అధికారులు ఆ భూముల్లోకి ప్రవేశించారు. అంతేకాకుండా ఆ సంస్థ యజమానులపై అక్రమంగా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయించారు. దీంతో బాధితులు మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

విచారణ సందర్భంగా కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఏవీ రంగనాథ్ ను అరెస్ట్ చేయాలని న్యాయమూర్తి మొదట ఆదేశించారు. ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తితో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుని వ్యక్తిగత హాజరుకు ఆదేశించారు. సాయంత్రం 6.30 గంటలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరయ్యారు.

ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా (Rule of law) అనేది ఒకటి ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. పదే పదే కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ ఆయన అలవాటుపడ్డ నేరగాడిలా మారారని మండిపడింది. హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించడం చెల్లదని స్పష్టం చేసింది. అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తితో అఫిడవిట్ దాఖలుకు అవకాశం ఇచ్చిన హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp