|  
FLASH NEWS
Dadasaheb Phalke Award 2024 : ‘కేజీఎఫ్’ నటుడికి అత్యున్నత పురస్కారం.. అనంత్ నాగ్‌ను వరించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు!  •  CM Revanth Reddy on KCR Farmhouse : కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు.. ఆ భూములను దళితులకు పంచుతామని ప్రకటన  •  PM Modi Friend : ప్రధాని మోదీని కలిసిన కొద్దిరోజుల్లోనే పరిష్కారం.. దశాబ్దాల భూ వివాదంలో ఆ స్నేహితుడికి ఊరట ఎలా లభించిందో తెలుసా?  •  Miss Universe India 2026 : మిస్ యూనివర్స్ వేదిక నుంచి ఆఫీస్‌కు.. తిరిగి విధుల్లో చేరిన అందాల భామ  •  Allu Arjun Father in Law : అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు..  • 
Skip to content

HYDRAA Commissioner AV Ranganath : హైడ్రా చీఫ్ రంగనాథ్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. పదవి నుంచి తొలగించాలని ఆదేశాలు

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైడ్రా (HYDRAA) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైడ్రా కమిషనర్ (HYDRAA Commissioner) ఏవీ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కి స్పష్టమైన సూచనలు చేసింది. సికింద్రాబాద్ (Secunderabad) సమీపంలోని లోతుకుంటలో సర్వే నెంబర్లు 1, 2 పరిధిలో ఉన్న 40 ఎకరాల భూములకు సంబంధించి ఈ వివాదం తలెత్తింది.

​ఈ భూములకు సంబంధించి ‘శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్’ (Shanta Sriram Constructions) వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు తమ భూముల్లోకి వచ్చి జోక్యం చేసుకుంటున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఏకంగా 63 కోర్టు ధిక్కరణ (Contempt of Court) కేసులు ఒక్క అధికారిపైనే ఉండటం ఏంటని ప్రశ్నించింది. సెక్రటరీ ర్యాంక్ (Secretary Rank) స్థానంలో ఉన్న ఒక ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను ఇన్నిసార్లు ధిక్కరించడం ఏమాత్రం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టులో అఫిడవిట్ (Affidavit) సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన న్యాయస్థానానికి క్షమాపణలు తెలుపుతూ తనకు కోర్టుల అన్నా న్యాయ వ్యవస్థ అన్నా ఎంతో నమ్మకం గౌరవం ఉన్నాయని పేర్కొన్నారు. లోతుకుంటలోని ఆ 40 ఎకరాల స్థలంలోకి హైడ్రా సిబ్బంది అసలు వెళ్లలేదని పిటిషనర్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని రంగనాథ్ తన అఫిడవిట్‌లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనల తీరుపై తీవ్రంగా ఉన్న హైకోర్టు ఆయనను బాధ్యతల నుంచి తొలగించాల్సిందేనని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అర్హత కలిగిన వేరొక అధికారిని కమిషనర్‌గా నియమించాలని తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) సూచించింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp