|   
🔴 BREAKING NEWS ► BRAOU and COL MoU : డిజిటల్ విద్యలో చారిత్రాత్మక ఘట్టం.. కెనడా సంస్థతో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కీలక ఒప్పందం Bhogapuram International Airport : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం.. ఏపీ ముఖచిత్రం మార్చేయనున్న మెగా ప్రాజెక్ట్ ప్రారంభం IBPS Clerk Notification 2026 : నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 11,403 బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలకు ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్ AP Building Rules : భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం ఊరట.. బిల్డింగ్ నిబంధనల్లో కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే BRAOU Online Courses : డిజిటల్ యుగంలోకి అంబేద్కర్ వర్సిటీ.. 4 ఆన్‌లైన్ కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్
Skip to content

HYDRAA Commissioner AV Ranganath : హైడ్రా చీఫ్ రంగనాథ్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. పదవి నుంచి తొలగించాలని ఆదేశాలు

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైడ్రా (HYDRAA) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైడ్రా కమిషనర్ (HYDRAA Commissioner) ఏవీ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కి స్పష్టమైన సూచనలు చేసింది. సికింద్రాబాద్ (Secunderabad) సమీపంలోని లోతుకుంటలో సర్వే నెంబర్లు 1, 2 పరిధిలో ఉన్న 40 ఎకరాల భూములకు సంబంధించి ఈ వివాదం తలెత్తింది.

​ఈ భూములకు సంబంధించి ‘శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్’ (Shanta Sriram Constructions) వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు తమ భూముల్లోకి వచ్చి జోక్యం చేసుకుంటున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఏకంగా 63 కోర్టు ధిక్కరణ (Contempt of Court) కేసులు ఒక్క అధికారిపైనే ఉండటం ఏంటని ప్రశ్నించింది. సెక్రటరీ ర్యాంక్ (Secretary Rank) స్థానంలో ఉన్న ఒక ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను ఇన్నిసార్లు ధిక్కరించడం ఏమాత్రం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టులో అఫిడవిట్ (Affidavit) సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన న్యాయస్థానానికి క్షమాపణలు తెలుపుతూ తనకు కోర్టుల అన్నా న్యాయ వ్యవస్థ అన్నా ఎంతో నమ్మకం గౌరవం ఉన్నాయని పేర్కొన్నారు. లోతుకుంటలోని ఆ 40 ఎకరాల స్థలంలోకి హైడ్రా సిబ్బంది అసలు వెళ్లలేదని పిటిషనర్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని రంగనాథ్ తన అఫిడవిట్‌లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనల తీరుపై తీవ్రంగా ఉన్న హైకోర్టు ఆయనను బాధ్యతల నుంచి తొలగించాల్సిందేనని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అర్హత కలిగిన వేరొక అధికారిని కమిషనర్‌గా నియమించాలని తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) సూచించింది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp