Skip to content
Home » గల్ఫ్ దేశాల్లో యుద్ధ ఉద్రిక్తతలు: తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు

గల్ఫ్ దేశాల్లో యుద్ధ ఉద్రిక్తతలు: తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు

​హైదరాబాద్: ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ పౌరుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24 గంటల పాటు పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు.

అత్యవసర సహాయం కోసం సంప్రదించండి

గల్ఫ్ రీజియన్‌తో పాటు పశ్చిమ ఆసియా దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసులు ఏవైనా ఇబ్బందులు ఎదురైనా లేదా స్వదేశానికి రావాలనుకున్నా ఈ కంట్రోల్ రూమ్ ద్వారా సహాయం పొందవచ్చు. తెలంగాణ భవన్ అధికారులు నిరంతరం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు సంబంధిత దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

సహాయం కోసం ఫోన్ నంబర్లు:

ప్రభుత్వం ప్రకటించిన ఈ క్రింది అధికారుల నంబర్లకు ఏ సమయంలోనైనా ఫోన్ చేయవచ్చు:

​వందన బరువా: 9871999044​

సీహెచ్. చక్రవర్తి: 9958322143​

జావేద్ హుస్సేన్: 9910014749

​రక్షిత్ నాయక్: 9643723157

​తెలంగాణ ప్రభుత్వం అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని, విదేశాల్లో ఉన్న తమ రాష్ట్ర పౌరులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని అధికారులు వెల్లడించారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.