
Hyderabad, Surya News: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని సాయినగర్ లో ఉన్న సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (Telugu University) విద్యార్థులకు ఒక ముఖ్యమైన సమాచారం. 2026-27 విద్యా సంవత్సరానికి (Academic Year) సంబంధించి మొదటి సంవత్సరం తరగతులను ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు వర్సిటీ సెంట్రల్ అడ్మిషన్ కమిటీ తెలిపింది. అలాగే అన్ని కోర్సులకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు (Tuition Fee) చెల్లించే గడువును కూడా పొడిగించారు. ఆగస్టు 4వ తేదీ వరకు విద్యార్థులు తమ ఫీజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెల్లించుకునే అవకాశం కల్పించారు.
విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు (Spot Admissions) నిర్వహించనున్నారు. ఆగస్టు 6, 7 తేదీల్లో ఈ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అన్ని సంబంధిత శాఖల్లో ఈ ప్రవేశాలు జరగనున్నాయి. అలాగే సెల్ఫ్ సపోర్టింగ్ (Self-Supporting) సీట్లు ఉన్న కోర్సులను కూడా ఇదే తేదీల్లో భర్తీ చేయాలని పీఠాధిపతులు, శాఖాధిపతులను సెంట్రల్ అడ్మిషన్ కమిటీ డైరెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు గడువు ముగియకముందే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



