
హైదరాబాద్, సూర్య న్యూస్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం (Quthbullapur Constituency) పరిధిలోని 129 సూరారం డివిజన్ టీఎస్ఐఐసీ కాలనీలో (TSIIC Colony) ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ వెరిఫికేషన్ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధ్యక్షులు పుప్పాల భాస్కర్, కాలనీ అధ్యక్షులు నేతి రాజా పాల్గొన్నారు.
సంబంధిత బీఎల్ఓలు (BLOs), బీఎల్ఏలతో కలిసి వీరు పోలింగ్ బూత్లను సందర్శించారు. ఓటరు మహాశయులకు పేర్ల నమోదు, చిరునామా మార్పు గురించి వివరించారు. పేరు, వయస్సు తదితర వివరాల సవరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కొత్త ఓటరు నమోదు విధానం, దానికి అవసరమైన పత్రాల గురించి సమగ్రంగా తెలియజేశారు.
📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!
తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.
📲 Join WhatsApp Channelస్థానిక అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వెల్ఫేర్ కమిటీ సభ్యులు బీఎల్ఓలకు (BLOs) పూర్తి సహకారం అందించాలని కోరారు. ఎన్యుమరేషన్ ఫారాలు ప్రతి ఇంటికి చేరేలా అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇతర బస్తీల్లో నివసిస్తున్న ఓటర్ల వివరాల సేకరణలో కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ నాయకులు సాయిబాబా, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రోషన్ తదితరులు పాల్గొన్నారు.



