Skip to content
Home » Vande Mataram : స్వాతంత్య్ర పోరాటంలో ‘వందేమాతరం’ ఒక శక్తి.. ఘనంగా 150 ఏళ్ల ఉత్సవాలు!

Vande Mataram : స్వాతంత్య్ర పోరాటంలో ‘వందేమాతరం’ ఒక శక్తి.. ఘనంగా 150 ఏళ్ల ఉత్సవాలు!

చింతల్, సూర్య న్యూస్: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ‘వందేమాతరం’ (Vande Mataram) నినాదం ప్రజల్లో ధైర్యాన్ని, ఐక్యతను నింపిన ఒక గొప్ప శక్తి అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) జిల్లా ప్రచారక్ సందీప్ (Sandeep) పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) మేడ్చల్ జిల్లా చింతల్ శాఖ ఆధ్వర్యంలో ‘150 ఏళ్ల వందేమాతరం’ (150 Years of Vande Mataram) సందర్భంగా జైస్ కన్వెన్షన్ హాల్‌లో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన సందీప్ మాట్లాడుతూ.. మన దేశం మనకు స్వేచ్ఛ, విద్య, అవకాశాలతో పాటు కలలు కనడానికి ధైర్యాన్ని ఇచ్చిందని కొనియాడారు. ప్రపంచంలో దేశాన్ని తల్లిగా భావించి గౌరవించే గొప్ప సంస్కృతి కేవలం భారతదేశానికే ఉందని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు వందేమాతరం నినాదంతోనే పోరాటాలు సాగించారని, అది కేవలం ఒక మాట మాత్రమే కాదని, అదొక ప్రేరణ మరియు సంకల్పమని గుర్తు చేశారు.

దేశాభివృద్ధిలో వైద్యులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు మరియు నాయకుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులందరూ ఆ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. నేటి నుంచి ప్రతి విద్యార్థి తమ కలలు కేవలం తమ కోసమే కాకుండా.. కుటుంబం, సమాజం మరియు ముఖ్యంగా దేశం కోసం ఉండాలని పిలుపునిచ్చారు. దేశం కోసం మనమందరం నిలబడాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఉద్బోధించారు.

ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి విభాగ్ కన్వీనర్ నాగేష్ (Nagesh), మేడ్చల్ జిల్లా కన్వీనర్ మృత్యుంజయ (Mrutyunjaya), కార్యకర్తలు వివేక్, కార్తీక్, మౌనిక మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. వందేమాతర గీతాలాపనతో కన్వెన్షన్ హాల్ దేశభక్తి స్మరణతో మారుమోగింది.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.