|   
🔴 BREAKING NEWS ► BJP MP K Laxman : 22ఏ పేరిట వేల కోట్ల దోపిడీ.. సామాన్యుల ఆస్తులపై కాంగ్రెస్ దందా: ఎంపీ లక్ష్మణ్ సంచలనం! Ministry of Education : దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో భారీ మార్పులు.. కేంద్ర విద్యాశాఖ కీలక నివేదిక! Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే
Skip to content

Jabardasth : రూ.200 కోట్ల ఆస్తులున్న జబర్దస్త్ స్టార్‌పై హత్యాయత్నం.. అభిమానుల ముసుగులో వచ్చి ఏం చేశారంటే?

మహబూబ్‌నగర్, సూర్య న్యూస్: బుల్లితెర పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’ (Jabardasth) ద్వారా ‘కొమురక్క’గా (Komarakka) గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ కొమరం (Komaram) అలియాస్ కొమరయ్య (Komaraiah) పై కిరాతక దాడి జరిగింది. సొంత గ్రామంలోనే అభిమానులమని నమ్మించి వచ్చిన ఎనిమిది మంది వ్యక్తులు ఆయనపై రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో (Udityala) మంగళవారం రాత్రి తీవ్ర కలకలం రేపింది.

కష్టాల నుంచి కోటీశ్వరుడి వరకు..

ఒకప్పుడు హోటళ్లలో పని చేస్తూ, బాత్‌రూంలు శుభ్రం చేస్తూ అత్యంత పేదరికంలో గడిపిన కొమరయ్య.. జబర్దస్త్‌లో లేడీ గెటప్స్ (Lady Gethups) ద్వారా స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయనకు స్వగ్రామంలో సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తులు, భూములు ఉన్నట్లు సమాచారం. రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటూ స్థానిక ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న ఆయనపై ఈ స్థాయిలో దాడి జరగడం సంచలనంగా మారింది.

దొంగతనం వివాదమే దాడికి కారణం?

ఈ దాడి వెనుక పాత కక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా కాశిరెడ్డిగూడకు చెందిన శ్రీనాథ్ గతంలో కొమురక్క వద్ద అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ఆ సమయంలో కొమురక్క ఇంట్లో బంగారం చోరీకి గురవ్వగా, శ్రీనాథ్‌ను నిలదీయడంతో తాను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. అయితే, రెండు రోజులు గడిచినా బంగారం తిరిగి ఇవ్వకపోవడంతో కొమురక్క అతడిని గట్టిగా మందలించారు. దీన్ని అవమానంగా భావించిన శ్రీనాథ్ తన స్నేహితులతో కలిసి దాడికి ప్లాన్ చేశాడు.

అర్ధరాత్రి హైడ్రామా.. చంపేస్తామని బెదిరింపులు!

మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీనాథ్ స్నేహితులైన వంశీకృష్ణ, వికాస్, చంద్రశేఖర్, గోవా శివ, రామ్‌చరణ్, నరేష్, పోతుల శివ, కిషోర్ కొమురక్క ఇంటికి చేరుకున్నారు. తాము అభిమానులమని, ఫోటోలు (Photos) దిగాలని చెప్పి లోపలికి ప్రవేశించారు. ఒక్కసారిగా శ్రీనాథ్ ప్రస్తావన తెచ్చి గొడవకు దిగారు. వంశీకృష్ణ రాళ్లతో దాడి చేయగా, చంద్రశేఖర్ కర్రతో కొట్టడంతో కొమురక్క కుడి చేతికి తీవ్ర గాయమైంది. అడ్డువచ్చిన ఆయన సోదరుడు యాదయ్య (Yadaiah), గ్రామస్థుడు రాముపై కూడా నిందితులు దాడి చేశారు. “ఎప్పటికైనా నిన్ను చంపేస్తాం” అంటూ బెదిరించి, తమ బైక్‌లను అక్కడే వదిలేసి పరారయ్యారు.

బాలానగర్ ఎస్‌ఐ లెనిన్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ (Arrest) చేశారు. ప్రస్తుతం కొమురక్క తన కుటుంబంతో కలిసి కోలుకుంటున్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp