|   
🔴 BREAKING NEWS ► BJP MP K Laxman : 22ఏ పేరిట వేల కోట్ల దోపిడీ.. సామాన్యుల ఆస్తులపై కాంగ్రెస్ దందా: ఎంపీ లక్ష్మణ్ సంచలనం! Ministry of Education : దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో భారీ మార్పులు.. కేంద్ర విద్యాశాఖ కీలక నివేదిక! Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే
Skip to content

PV Narasimha Rao Memorial Lecture : అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో ఘనంగా పీవీ స్మారకోపన్యాసం.. ప్రసంగించిన సురభి వాణీదేవి

హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) లో నేడు భారతరత్న శ్రీ పి.వి. నరసింహారావు (PV Narasimha Rao) స్మారక ఉపన్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది. క్యాంపస్ లోని డా.సి.నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఈ ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేధావులు, విద్యావేత్తలు విశేషంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్థికవేత్త, ప్రజా మేధావి డా. పరకాల ప్రభాకర్ (Dr Parakala Prabhakar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. “SIR 2025–26: ఇది భారతదేశ భావనను ఛిన్నాభిన్నం చేస్తుందా?” అనే అంశంపై ఆయన కీలకోపన్యాసం చేశారు. దేశ ప్రస్తుత పరిస్థితులపై ఆయన చేసిన ప్రసంగం ఆలోచింపజేసేలా సాగింది.

​ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి (Surabhi Vani Devi) ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సభను ఉద్దేశించి ప్రసంగించారు. పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను, ఆయన ఆలోచనా విధానాన్ని ఆమె గుర్తు చేశారు.

​ఈ విశేష కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ (Vice Chancellor) ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించారు. అలాగే అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. విద్యావేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp