|  
FLASH NEWS
Jio Network Issue : సిగ్నల్ రావడం లేదని వినూత్న నిరసన.. టెలికాం ఉద్యోగిని ఏకంగా టవర్‌కే కట్టేసిన గ్రామస్తులు!  •  KTR Comments on Konda Surekha : మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌ వెనుక మంచిరేవుల భూకుంభకోణం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు  •  BRICS Summit 2026 : ‘మంచివారితోనే స్నేహం.. చెడ్డవారితో వద్దు’.. బ్రిక్స్ వేళ మోదీ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి?  •  KTR on Farmers Protest: సీఎం రేవంత్ సొంత ఊళ్లో రైతుల నిరసన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!  •  BRS Fake Account: సీఎం రేవంత్ చదివిన పోస్ట్‌పై సైబర్ క్రైమ్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు  • 
Skip to content

AP Covid Cases : ఏపీలో మళ్లీ కరోనా కలకలం, నలుగురు మృతితో రాష్ట్ర వ్యాప్తంగా టెన్షన్

అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మళ్లీ కరోనా వైరస్ (Covid-19) చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు 12 కోవిడ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు.

ప్రధానంగా కడప, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో ఈ కొత్త కేసులు నమోదు అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ కోవిడ్ పాజిటివ్ (Covid Positive) వచ్చిన వారిలో నలుగురు మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒకే ప్రాంతంలో క్లస్టర్ గా కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

కోవిడ్ తో మృతి చెందిన నలుగురు వ్యక్తులకు ముందుగానే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. వైరస్ జన్యుక్రమ విశ్లేషణ కోసం 5 నమూనాలను పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు (National Institute of Virology) రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ప్రస్తుతం ముగ్గురు పేషెంట్లు హోమ్ ఐసోలేషన్ లో (Home Isolation) ఉండగా, మరో ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మరో ముగ్గురు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు సమాచారం. జూన్ 26 నుంచి జూలై 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 67 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఎవరూ అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ (Health Department) సూచించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్యులు, ఆసుపత్రులను అప్రమత్తం చేశామని ఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండియన్ తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా జూలై 1 నుంచి 339 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో అత్యధికంగా కేరళ (Kerala) రాష్ట్రంలో 115 కోవిడ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

దేశంలోని పలు నగరాల్లో కోవిడ్ కేసులు బయటపడటంతో మళ్లీ లాక్‌డౌన్ (Lockdown) పరిస్థితులు వస్తాయా అని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 2020 నాటి తీవ్రమైన పరిస్థితులు పునరావృతం అవుతాయా అనే టెన్షన్ ప్రజల్లో కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు మరియు ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp