|  
FLASH NEWS
​Nestle India : నెస్లే పిల్లల ఉత్పత్తులపై FSSAI కొరడా.. ఆ రెండు బ్రాండ్లపై కఠిన చర్యలకు సిద్ధం  •  Ramayana Movie : ‘రామాయణ’ ఇంగ్లీష్ వెర్షన్‌లో భారీ మార్పులు.. ఆ సీన్లు, పాటలు కట్?  •  Election Commission : టీఎంసీలో వర్గపోరు.. మమత, రెబెల్ గ్రూపులకు కొత్త పేర్లు, గుర్తులు కేటాయించిన ఈసీ  •  Zombie Reddy 2 : జాంబీ ప్రపంచంలోకి రియల్ స్టార్ ఎంట్రీ.. పవర్‌ఫుల్ వారియర్ లుక్‌లో ఉపేంద్ర  •  IND vs AFG 3rd T20 : ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. సిరీస్ క్లీన్ స్వీప్  • 
Skip to content

TWJF Kukatpally : కూకట్‌పల్లి టీడబ్ల్యూజేఎఫ్ నూతన అధ్యక్షుడిగా ఎర్ర యాకన్న.. జర్నలిస్టుల హక్కుల సాధనకు మహాసభ తీర్మానం

కూకట్‌పల్లి, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలోని (Telangana State) అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డులు (Health Cards) దక్కేలా ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామని టీడబ్ల్యూజేఎఫ్ (TWJF) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధన కోసం పాత్రికేయులంతా ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి పరిధిలోని ఏఎస్ రాజు నగర్ సంక్షేమ సంఘం భవనంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కట్టెల మల్లేశం ఆధ్వర్యంలో శుక్రవారం కూకట్‌పల్లి నియోజకవర్గ (Kukatpally Constituency) మహాసభను నిర్వహించారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మామిడి సోమయ్య జర్నలిస్టుల సమస్యలపై (Journalist Issues) సుదీర్ఘంగా మాట్లాడారు. కేబుల్ టీవీ, డిజిటల్ మీడియా (Digital Media) తదితర మాధ్యమాల్లో పనిచేస్తున్న అర్హులైన రిపోర్టర్లందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తమ సంఘం కృషి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్లు వర్తింపజేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన పేర్కొన్నారు.

అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ సమక్షంలో కూకట్‌పల్లి నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడబ్ల్యూజేఎఫ్ కూకట్‌పల్లి అధ్యక్షుడిగా ఎర్ర యాకన్న (Erra Yakanna), ప్రధాన కార్యదర్శిగా నాగుల అంజిబాబు, కోశాధికారిగా షబ్బీర్, ఉపాధ్యక్షుడిగా గోపి ఎన్నికయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా నవీన్, సుజాత, నాగరాజుగౌడ్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు బాధ్యతలు స్వీకరించారు.

నూతన కార్యవర్గానికి పలువురు సీనియర్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు రవికుమార్, జగదీష్ గుప్తా, విద్యా వెంకట్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చైతన్య రెడ్డి, నాగరాజు గౌడ్, మహేందర్ పాల్గొన్నారు. వారితో పాటు మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది బాలరాజు, ఉపాధ్యక్షుడు కొండల్ రెడ్డి మరియు ఇతర పాత్రికేయ మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp