
హైదరాబాద్, సూర్య న్యూస్ : పేదల ఆకలి తీర్చాలనే ఉన్నతమైన ఆశయంతో మొదలైన ‘ఎన్టీఆర్ మీల్’ (NTR Meal) సేవలు శాశ్వతంగా నిలిచిపోయాయి. ఈ మేరకు నిర్వాహకులు (Organizers) అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పేరుతో ప్రారంభమైన ఈ బృహత్తర కార్యక్రమం ఎంతో మంది అభాగ్యులకు కడుపునిండా భోజనం అందించింది. అయితే అనుకోకుండా ఈ సేవలను పూర్తిగా ముగిస్తున్నట్లు తాజాగా ప్రకటించడం అందరినీ విచారానికి గురిచేసింది.
150కి పైగా కేంద్రాల్లో అన్నదానం
కేవలం ఆహారం వండి పెట్టడమే కాకుండా ప్రత్యేకంగా ‘ఎన్టీఆర్ మీల్ కిట్స్’ (NTR Meal Kits) కూడా నిర్వాహకులు రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా 150కి పైగా కేంద్రాల్లో దాదాపు 2000కు పైగా కిట్లను పేదలకు పంపిణీ చేశారు. సరైన రవాణా సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాలకు సైతం కొరియర్ సేవలు (Courier Services) ఉపయోగించి వీటిని చేరవేశారు. ఎంతో మంది వాలంటీర్లు అంకితభావంతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
కిట్లు తిరిగి ఇచ్చేయాలని విజ్ఞప్తి
ఈ సేవలు ముగుస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి తెరపైకి తెచ్చారు. గతంలో తమ వద్ద నుంచి కిట్లు (Kits) పొందిన లబ్ధిదారులు లేదా వివిధ కేంద్రాల ప్రతినిధులు వాటిని వీలైనంత త్వరగా తిరిగి ఇచ్చేయాలని కోరారు. కిట్లు తమ వద్దే ఉంచుకోకుండా వెంటనే చెన్నైలోని (Chennai) ప్రధాన కార్యాలయానికి పంపాలని సూచించారు. స్వయంగా లేదా కొరియర్ ద్వారా ఈ కిట్లను చేరవేయాలని వారు అభ్యర్థించారు.
చెన్నై కార్యాలయం చిరునామా ఇదే
ఈ సుదీర్ఘ సేవా ప్రయాణంలో తమకు అండగా నిలిచి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు (NTR Fans) ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కిట్లను తిరిగి పంపించాల్సిన చెన్నై ఆఫీస్ చిరునామా TVH Ouranya Bay, OMR, Chennai, Tamil Nadu – 603103 అని వారు స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా కిట్లు ఆఫీసుకు చేరేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



