
సూర్యాపేట, సూర్య న్యూస్: సూర్యాపేట (Suryapet) జిల్లా పరిధిలో బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఒక ఫ్రెష్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Bus) అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ భయానక ఘటనలో ఆరుగురు ప్రయాణికులు (Passengers) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
కోదాడ మండలం దొరకుంట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు ఢీకొట్టిన కంటైనర్ లారీలో ఐరన్ లోడ్ ఉంది. వేగంగా ఢీకొట్టడంతో ఆ ఐరన్ దిమ్మెలు బస్సులోకి దూసుకెళ్లాయి. దీనివల్లే ప్రయాణికులు దారుణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



