
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు నాన్-క్యాడర్ పోలీసు అధికారులకు (ఎస్పీలకు) ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) హోదా వరించింది. రాష్ట్ర పోలీస్ సర్వీస్ నుంచి వీరిని ఐపీఎస్లుగా (సెలెక్ట్ లిస్ట్-2025) పదోన్నతి కల్పిస్తూ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రటరీ ఉదయ్ ప్రకాష్ గుప్తా ఆగస్టు 24న గెజిట్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఐపీఎస్ హోదా దక్కిన అధికారులు వీరే..
- రవీందర్ పులిగిల్ల
- బి. శ్రీ బాల దేవి
- వి. అరవింద బాబు
- బి. రాజ మహేంద్ర నాయక్
- బి. సాయి శ్రీ
- ఐ. పూజ
- పి. కరుణాకర్
ఈ అధికారులంతా ఇండియన్ పోలీస్ సర్వీస్ నిబంధనల ప్రకారం ఏడాది పాటు ప్రొబేషన్లో ఉంటారని కేంద్రం తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. వీరికి జాతీయ పోలీస్ అకాడమీలో ఇండక్షన్ శిక్షణ (Induction Training) అందించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నియామకాలపై సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి, యూపీఎస్సీకి పంపించారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



