
కిర్గిస్థాన్, సూర్య న్యూస్ : కిర్గిస్థాన్ వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో పాకిస్థాన్ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. పది దేశాల అధినేతలతో దిగిన గ్రూప్ ఫొటోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ లేకుండా పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం (PMO) క్రాప్ చేసి పోస్ట్ చేయడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.
మంగళవారం జరిగిన ఈ సదస్సులో సభ్య దేశాల అధినేతలందరూ కలిసి గ్రూప్ ఫొటో దిగారు. అయితే, పాక్ పీఎంవో విడుదల చేసిన ఫొటోలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యలో ఉన్నట్లుగా మార్చి, ప్రధాని మోదీతో పాటు మరికొందరు నేతలను తొలగించారు. అంతేకాకుండా, ఎస్సీఓ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన వీడియోలోనూ మోదీ ఉన్న భాగాన్ని ఎడిట్ చేసి, ఆ వీడియోను షెహబాజ్ షరీఫ్ (Pak PM Shehbaz Sharif) తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేశారు. తమ ప్రధానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు చూపించుకునేందుకే పాక్ ఈ చర్యలకు పాల్పడినట్లు విమర్శలు వస్తున్నాయి.

అసలు ఫొటోతో బదులిచ్చిన ప్రధాని మోదీ
పాకిస్థాన్ చేసిన ఈ ఎడిటింగ్ ప్రయత్నాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. మోదీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పూర్తి స్థాయి గ్రూప్ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో షెహబాజ్ షరీఫ్ కుడివైపున నాలుగో స్థానంలో సాధారణంగా నిలబడి ఉండటం స్పష్టంగా కనిపించింది. అసలు ఫొటో బయటకు రావడంతో పాక్ ప్రధాని పరువు పోయినట్లయింది. దీనిపై నెటిజన్లు, సీనియర్ జర్నలిస్టులు సోషల్ మీడియా వేదికగా పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో సెటైర్లు వేస్తున్నారు. దౌత్యం ప్రదర్శించాల్సిన వేదికపై ఇలాంటి ఎడిటింగ్ నైపుణ్యాలు చూపించడం పాక్ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.
ఉగ్రవాదంపై పరోక్ష హెచ్చరికలు
ఈ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ ఉగ్రవాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా, వ్యూహాత్మక ఆయుధంగా వాడుకుంటున్న దేశాలకు ప్రపంచం స్పష్టమైన సందేశం ఇవ్వాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



