|  
FLASH NEWS
CM Revanth Reddy : సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేసీఆర్ ఫైర్.. కాంగ్రెస్ పాలన థర్డ్ క్లాస్ అంటూ విమర్శలు  •  YS Sharmila : వైఎస్సార్ ఇంట మరో పెళ్లి సందడి.. అంజలి రెడ్డి వరుడు ఎవరంటే?  •  Miss World 2026 : విశ్వసుందరి కిరీటం ఆ దేశం సొంతం.. సగంలోనే ఆగిపోయిన భారత సుందరి ప్రయాణం!  •  రేవంత్‌తో ‘రాజన్న’ దోస్తీ!కేబినెట్ బెర్త్ ఖాయమా? మునుగోడు క్యాడర్‌లో నయాజోష్…  •  పాకిస్థాన్‌ను చిత్తుచేసిన భారత్.. సెమీస్‌లో అడుగుపెట్టిన దాయాది.. షెఫాలీ సరికొత్త రికార్డ్  • 
Skip to content

ఉద్యమ నేతకు అక్షర నివాళి..  ఎమ్మెల్సీ సత్యం చేతుల మీదుగా ‘తోడే అడివయ్య’ పుస్తకావిష్కరణ

  • తండ్రి ఆశయానికి ప్రతిరూపం.. 
  • తాత జీవిత చరిత్రను లోకానికి అందించిన వారసులు

ఇబ్రహీంపట్నం: ప్రజా ఉద్యమాల్లో నిస్వార్థంగా పనిచేసి ఎంతోమందికి మార్గదర్శకుడిగా నిలిచిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఎం నేత తోడే అడివయ్య జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం ఇబ్రహీంపట్నంలోని వైష్ణవి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ సభకు పలువురు రాజకీయ, సామాజిక, ఉద్యమ నేతలు విశేష సంఖ్యలో హాజరయ్యారు. వాస్తవాలను సమాజానికి పరిచయం చేయాలన్న సంకల్పంతో రూపొందించిన ఈ పుస్తకం సభికుల ప్రశంసలు అందుకుంది.

c6a468dc 135e 4ce0 ac46 1c52be05f326


నాటి ఉద్యమ స్మృతుల నెమరువేత


ఒకప్పటి విప్లవోద్యమ సహచరులు, తోడే అడివయ్య శిష్యులు ఈ కార్యక్రమానికి హాజరై తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నాటి ఉద్యమ యువకులు హునా నాయక్, కర్నాటి రామ్ రెడ్డి, తెలకపల్లి సత్యనారాయణ, మధుసూదన్ రెడ్డి, చందు నాయక్, బండి సత్యన్న తదితరులు పాల్గొన్నారు. తమ జీవితాలకు గురువుగా నిలిచిన అడివయ్య గారితో ఉన్న అనుబంధాన్ని వారు వేదికపై పంచుకున్నారు. ఆయన పోరాట పటిమను వివరిస్తూ, ఈ జీవిత చరిత్రలో తమకు కూడా భాగస్వామ్యం కల్పించడం పట్ల వారు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.


తండ్రి ఆఖరి కోరిక.. పిల్లల బాధ్యత


ఈ కార్యక్రమం వెనుక ఒక విషాదకరమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన నేపథ్యం ఉంది. తన తండ్రి అడివయ్య పై ఉన్న ప్రేమతో, ఆయన వాస్తవ జీవితాన్ని సమాజానికి అందించాలని తోడే బాలచందర్ తీవ్రంగా పరితపించారు. పుస్తక ఆవిష్కరణకు తేదీ ఖరారు చేసి, అందరికీ ఆహ్వానాలు పంపిన ఆయన, ఈ వేడుకను కళ్లారా చూడకుండానే అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచివెళ్లారు. తండ్రి మరణించిన తీవ్ర విషాదంలోనూ, ఆయన ఆఖరి కోరికను నెరవేర్చడం కోసం బాలచందర్ కుమార్తె తోడే మానస కుమారి, డాక్టర్ తోడే మదన్ ముందుకొచ్చారు. తోడే మానస కుమారి సభా అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, తమ తాతగారి జీవిత చరిత్రను సమసమాజానికి అంకితం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వారి నిబద్ధత సభికులను కంటతడి పెట్టించింది.

e358f3bd 71ac 44ac 882d a42c033daef2


తరలివచ్చిన ముఖ్య అతిథులు


ఈ పుస్తకావిష్కరణ సభలో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. సీపీఐ నేత ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పీవోడబ్ల్యూ జాతీయ నాయకురాళ్లు ఝాన్సీ, సంధ్య, రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ తదితరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. వారితో పాటు రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు పెసరకాయల జంగారెడ్డి, హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు ప్రేమలత తోడే, హైకోర్టు న్యాయవాది కట్ట భగవంత్ రెడ్డి, రైతు సంఘం జిల్లా నేత ఆవుల మల్లేష్, రిటైర్డ్ డీసీపీ జాన్ వెస్లీ, ఎస్సీ కార్పొరేషన్ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సర్వయ్య ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. వీరితో పాటు పలువురు సామాజిక వేత్తలు, రాజకీయ విశ్లేషకులు, పార్టీ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

6a13dab5 cbc3 467b 8cae db65bbbea5e7
తోడే అడివయ్య మనవడు డా’ మదన్, మనవరాలు మానసలతో ఎమ్మెల్సీ సత్యం నెల్లికంటి

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp