
అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా డీజే వాహనాలకు (DJ Vehicles) ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతి ఇవ్వాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పోలీసు శాఖను కోరారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హోంమంత్రి అనిత, రాష్ట్ర డీజీపీలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
గణేష్ నిమజ్జనం కోసం డీజేలు ఏర్పాటు చేసుకునేందుకు పోలీసులు కింది స్థాయిలో అనుమతి నిరాకరిస్తున్నారని తన దృష్టికి వచ్చినట్లు మంత్రి తెలిపారు. అనుమతుల కోసం వెళ్లిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ తనకు అనేక సందేశాలు వస్తున్నాయని ఆయన తన పోస్ట్లో పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.
ఉత్సవాల సమయంలో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని ఆయన కోరారు. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క డీజే వాహనాన్ని కూడా సీజ్ చేయకుండా పోలీసు ఉన్నతాధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కింది స్థాయి పోలీసుల తీరుపై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో మంత్రి నేరుగా స్పందించడం గమనార్హం.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



