|  
FLASH NEWS
నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  •  India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  •  Telangana Assembly : నా చీర లాగారు.. అసెంబ్లీ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి  • 
Skip to content

బీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్ గూటికి మేడ్చల్ జిల్లా ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె రాజు

కుత్బుల్లాపూర్:రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతోంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ సమక్షంలో మన్నె రాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి, మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది.

అభివృద్ధికి ఆకర్షితులయ్యే చేరిక: భూపతిరెడ్డి

ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో పాత, కొత్త నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, కొంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్, సీనియర్ నాయకులు ముత్యంరెడ్డి, రషీద్, లక్ష్మ రెడ్డి, బట్ట పాలకృష్ణ, మైసి గారి శ్రీనివాస్, ఆలేటి శ్రీనివాస్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp