|   
🔴 BREAKING NEWS ► BRAOU and COL MoU : డిజిటల్ విద్యలో చారిత్రాత్మక ఘట్టం.. కెనడా సంస్థతో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కీలక ఒప్పందం Bhogapuram International Airport : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం.. ఏపీ ముఖచిత్రం మార్చేయనున్న మెగా ప్రాజెక్ట్ ప్రారంభం IBPS Clerk Notification 2026 : నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 11,403 బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలకు ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్ AP Building Rules : భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం ఊరట.. బిల్డింగ్ నిబంధనల్లో కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే BRAOU Online Courses : డిజిటల్ యుగంలోకి అంబేద్కర్ వర్సిటీ.. 4 ఆన్‌లైన్ కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్
Skip to content

CM Revanth Reddy : ట్రెజరీలతో పనిలేకుండా నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే నిధులు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

Hyderabad, Surya News: తెలంగాణలోని (Telangana) గ్రామపంచాయతీల (Gram Panchayats) బలోపేతం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. పల్లెలకు పూర్తిస్థాయి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం (State Government) అడుగులు వేస్తోంది. గ్రామపంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీ (Treasury) ఖాతాల్లో కాకుండా నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో (Bank Accounts) జమ చేసుకునేలా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలో (Panchayat Raj Act) మార్పులు చేయనున్నారు.

​గత విధానం ప్రకారం పంచాయతీలకు పన్నుల ద్వారా వచ్చే సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాల్లో జమ చేయాల్సి వచ్చేది. దీనివల్ల అత్యవసర పనులు చేపట్టాలన్నా లేదా పారిశుద్ధ్య కార్మికులకు (Sanitation Workers) సకాలంలో వేతనాలు ఇవ్వాలన్నా ఇబ్బందులు ఎదురయ్యేవి. నిధుల విడుదల కోసం సర్పంచులు (Sarpanches) ట్రెజరీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రభుత్వ అనుమతులతో పాటు సాంకేతిక కారణాల వల్ల నిధులు డ్రా చేయడంలో జాప్యం జరిగి అభివృద్ధి కుంటుపడేది.​

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

ఈ ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి పాత వ్యవస్థకు స్వస్తి పలకాలని నిర్ణయించారు. ఈ నూతన విధానం అమల్లోకి వస్తే గ్రామాల్లో వసూలయ్యే ఆస్తి పన్నులు (Property Tax) మరియు ఇతర రూపాల్లో వచ్చే ఆదాయం నేరుగా పంచాయతీల స్థానిక ఖాతాల్లోనే ఉంటాయి. నిధుల వినియోగంలో సర్పంచులకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ట్రెజరీలతో సంబంధం లేకుండా గ్రామ అవసరాలకు డబ్బులను డ్రా చేసుకునే వీలుంటుంది.​ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల బృందం చట్ట సవరణకు అవసరమయ్యే ముసాయిదాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే ఈ నూతన విధానాన్ని అధికారికంగా అమలు చేయనున్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp