|   
🔴 BREAKING NEWS ► Trainee IPS Case : సీపీ సజ్జనార్‌పై సంచలన ఆరోపణలు.. ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారంటూ ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు! UPI Transaction Charges : యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. సామాన్యులపై భారం పడుతుందా? నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇదే! Thalapathy Vijay Divorce : సీఎం విజయ్‌కు ఊరట.. విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న భార్య సంగీత IRCTC Sapta Jyotirlinga Yatra : ఒక్క ట్రిప్‌లోనే 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సిటిసి ప్రత్యేక భారత్ గౌరవ్ టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే AP Weather Alert : ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి
Skip to content

Hyderabad ACB Raids : ఇంట్లోనే కాదు బ్యాంకు లాకర్లలోనూ గుట్టలుగా నోట్ల కట్టలు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరిరావు అవినీతి సామ్రాజ్యం

Hyderabad, Surya News: అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారుల సోదాల్లో సర్వే, భూమి రికార్డుల కార్యాలయం మల్టీజోన్-2 ఉపసంచాలకుడు (Deputy Director) సుంకరి నరహరిరావు అక్రమాస్తుల చిట్టా రోజుకో మలుపు తిరుగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల (Disproportionate Assets) కేసులో అరెస్టయిన ఆయన వ్యవహారంలో మరో భారీ నగదు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

గతంలో ఆయన ఇంట్లో దొరికిన కోట్ల రూపాయల నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDs) మరువక ముందే మరో సంచలనం చోటుచేసుకుంది. తాజాగా శనివారం ఆయన భార్య వందన పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరిచారు. శాలిబండలోని కెనరా బ్యాంకులో (Canara Bank) ఉన్న ఈ లాకర్ల తాళాలు ఇచ్చేందుకు నరహరిరావు నిరాకరించారు. దీంతో ఏసీబీ డీఎస్పీ మాజిద్ ఖాన్, ఇన్‌స్పెక్టర్ గౌస్ ఆజాద్ బృందం న్యాయస్థానం నుండి ప్రత్యేక సెర్చ్ వారెంట్ (Search Warrant) తీసుకున్నారు. బ్యాంకుకు వెళ్లి ఆ లాకర్లను పగలగొట్టి చూడగా ఏకంగా రూ. 1.50 కోట్ల నగదు కట్టలతో పాటు సుమారు 2 కిలోల బంగారం (Gold) బయటపడింది.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

ఇప్పటివరకు లభించిన మొత్తం ఆస్తుల వివరాలు చూసి అధికారులు సైతం విస్మయం చెందుతున్నారు. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో దొరికిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంట్లో లభించిన నగదు రూ. 1.54 కోట్లు.

​బ్యాంకు లాకర్లలో దొరికిన నగదు రూ. 1.50 కోట్లు.

​బ్యాంకు ఖాతాల నిల్వలు (Bank Balance) రూ. 2.29 కోట్లు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ. 5.04 కోట్లు.

సుమారు 2 కిలోల బంగారం బిస్కెట్లు, ఆభరణాలు.

చర, స్థిరాస్తుల విలువ (Real Estate Assets) రిజిస్ట్రేషన్ విలువల ప్రకారమే రూ. 13.05 కోట్లు.

సాధారణ సర్వేయర్ (Surveyor) నుండి కోట్ల అధిపతిగా ఎదిగిన నరహరిరావుది గౌలిపురాకు చెందిన సాధారణ మధ్యతరగతి కుటుంబం. తండ్రి మరణించడంతో 1987లో కారుణ్య నియామకం (Compassionate Appointment) కింద ఉద్యోగంలో చేరారు. ఉమ్మడి రంగారెడ్డి (Rangareddy) జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసిన సమయంలో ఆయన అక్రమాలకు తెరలేపారు. హైదరాబాద్ (Hyderabad) పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులవిగా మారుస్తూ తప్పుడు రిపోర్టులు సృష్టించి కోట్లు దండుకున్నారు. ఎవరిపైనా నమ్మకం లేకనే ఈ అక్రమ సంపాదన అంతా ఇంట్లో, బ్యాంకు లాకర్లలో దాచినట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఏసీబీ నివేదికల (ACB Reports) ప్రకారం 39 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగ కాలంలో ఆయన అధికారికంగా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 1.60 కోట్లు మాత్రమే. అందులో ఆయన ఏకంగా రూ. 1.01 కోట్లు ఖర్చు చేశారు. లెక్క ప్రకారం ఆయన వద్ద కేవలం రూ. 59 లక్షలు (59 Lakhs) మాత్రమే మిగిలి ఉండాలి. కానీ ఆయన సంపాదనకు మించి రూ. 3.08 కోట్ల అదనపు ఆస్తులతో పాటు కోట్లాది రూపాయల నగదు దొరకడం ఆయన అవినీతికి అద్దం పడుతోంది. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైల్లో (Chanchalguda Jail) రిమాండ్‌లో ఉన్నారు. ఏసీబీ అధికారులు ఈ కేసుపై దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp