
వాషింగ్టన్, సూర్య న్యూస్ : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశానికి డేంజర్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశ మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రధానంగా ఇరాన్ కు చెందిన ఖార్గ్ ద్వీపాన్ని (Kharg Island) తమ ఆధీనంలోకి తీసుకుంటామని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై ఇరాన్ (Iran) తో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు తేల్చి చెప్పారు.
చర్చల పేరుతో ఇరాన్ తమ సమయాన్ని వృధా చేస్తోందని ట్రంప్ విమర్శించారు. ఇరాన్ తప్పులు చేస్తూనే ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశంతో సీజ్ ఫైర్ (Ceasefire) ముగిసిందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరానియన్లు ఆటలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇటీవల ఇరాక్ దేశంలో (Iraq) రాకెట్ దాడి జరిగింది.
ఈ రాకెట్ దాడిలో అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన సైనికులు మరణించారు. దీనికి ఇరాన్ కారణమని అమెరికా ఆరోపించింది. ప్రతికారంగా ఇరాక్ లోని ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా స్థావరాలపై అమెరికా దళాలు (US Forces) దాడులు చేశాయి. ఈ దాడుల నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటన చేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఇరాన్ లోని ఖుమేనీ అంత్యక్రియల సందర్భంగా ఇరానియన్లు అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికాకు మరణం, ఇజ్రాయెల్ కు మరణం అనే నినాదాలతో వారు హోరెత్తించారు.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




