|   
🔴 BREAKING NEWS ► Vaibhav Sooryavanshi : సచిన్ 37 ఏళ్ల రికార్డు బ్రేక్.. అరంగేట్రం చేసిన 15 ఏళ్ల కుర్రాడు. కానీ..? TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ Food Adulteration in Hyderabad : మీరు తినేది అన్నమా? విషమా? 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్, నగరంలో వణికిపోతున్న ఫుడ్ మాఫియా Save Telugu University : అక్షరాల గుడిలో ఆక్రమణల పర్వం.. వర్సిటీని కాపాడుకునేందుకు కదిలివచ్చిన విద్యార్థి, మేధావి లోకం! Pakistan Airstrikes : అఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ బాంబుల వర్షం, ఘాటుగా స్పందించిన భారత్
Skip to content

Food Adulteration in Hyderabad : మీరు తినేది అన్నమా? విషమా? 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్, నగరంలో వణికిపోతున్న ఫుడ్ మాఫియా

Hyderabad, Surya News: నగరంలో ఆహార కల్తీపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తినే అన్నంలో కల్తీలు, తాగే పాలలో రసాయనాలు కలుపుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న వారి భరతం పడుతున్నారు. ఈ ముప్పును అరికట్టేందుకు హైదరాబాద్‌ ఫుడ్‌ అడల్టరేషన్‌ సర్వైలెన్స్ టీమ్‌ (H-FAST) ఏర్పాటై వంద రోజులు పూర్తయింది. మార్చి 19న ఏర్పాటైన ఈ ప్రత్యేక విభాగం సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతర దాడులు చేస్తోంది.

Food Adulteration in Hyderabad : 100 రోజుల దాడుల్లో విస్తుపోయే నిజాలు

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

​టాస్క్ ఫోర్స్ డీసీపీ నేతృత్వంలో 36 మంది అధికారులతో కూడిన హెచ్‌-ఫాస్ట్‌ విభాగం క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఈ వంద రోజుల్లో నగరవ్యాప్తంగా వివిధ జోన్లలో మొత్తం 185 కేసులు నమోదు చేశారు. సుమారు 121.87 టన్నుల ప్రమాదకరమైన కల్తీ ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జోన్ల వారీగా చూస్తే అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్‌లో 55 కేసులు నమోదు అయ్యాయి. గోల్కొండలో 44, సికింద్రాబాద్‌లో 35, చార్మినార్‌లో 21, శంషాబాద్‌లో 13, జూబ్లీహిల్స్‌లో 12, ఖైరతాబాద్ జోన్‌లో 5 కేసులు నమోదయ్యాయి.

స్వాధీనం చేసుకున్న పదార్థాల వివరాలు చూస్తే వ్యాపారులు ప్రజల ప్రాణాలతో ఏ విధంగా ఆడుకుంటున్నారో స్పష్టం అవుతోంది. నిత్యం వాడే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌కు సంబంధించి 27 కేసుల్లో భారీగా నకిలీ నిల్వలను పట్టుకున్నారు. ఇక్కడ ఏకంగా 27,024 కిలోల కల్తీ పేస్ట్ పట్టుబడింది. కృత్రిమ రసాయనాలతో పండ్లను మగ్గబెట్టే 16 ముఠాల గుట్టురట్టు చేసి 25,845 కిలోల పండ్లను సీజ్ చేశారు. చికెన్ వ్యర్థాలకు సంబంధించిన 6 కేసుల్లో 60 టన్నుల కంటే ఎక్కువ చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పచ్చళ్లు, కల్తీ కోవా, నకిలీ టీ పొడి, కల్తీ నెయ్యి, పనీర్ వంటి వాటిని కూడా పెద్ద ఎత్తున పట్టుకున్నారు. మరో 247 కేసులను తదుపరి చర్యల కోసం జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి బదిలీ చేశారు.

పీడీ యాక్ట్ తప్పదు – పోలీసుల కఠిన హెచ్చరిక​

ఆహార కల్తీని కేవలం వ్యాపార మోసంగా పరిగణించడం లేదని సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. ఇది అమాయకుల ప్రాణాలతో ఆడుకునే హత్యాయత్నంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. కల్తీ మహమ్మారిని అరికట్టడంలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పిలుపునిచ్చారు. కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే డయల్ 100 కు కాల్ చేయవచ్చు. లేదంటే హెచ్-ఫాస్ట్ వాట్సాప్ నంబర్ 8712661212 కు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు.

📲 Join WhatsApp