
హైదరాబాద్, సూర్య న్యూస్ : దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ (GDS Posts) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 23,757 పోస్టులను భర్తీ చేసేందుకు ఇండియా పోస్ట్ (India Post) నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 21వ తేదీ వరకు గడువు విధించారు.
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే మెరిట్ ప్రాతిపదికన ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు నిబంధనలు
అర్హులైన అభ్యర్థులు పోస్టల్ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తుదారులు కేవలం ఒక పోస్టల్ సర్కిల్కు మాత్రమే అప్లై చేసుకోవాలనే నిబంధనను అధికారులు స్పష్టం చేశారు. గడువు ముగియడానికి కేవలం కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



