
మర్రిగూడ, సూర్య న్యూస్ : జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం (National Teachers Day) సందర్భంగా మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లి ఎంపీపీఎస్ (MPPS) పాఠశాలలో గురువులకు ఘన సత్కారం జరిగింది. వడ్డగాని ఇందిరా విద్యాదీపం ఫౌండేషన్ చైర్మన్ వడ్డగాని సాయిరాం సౌజన్యంతో విద్యార్థులు తమ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు.
ఈ కార్యక్రమం ప్రారంభంలో ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రను, ఉపాధ్యాయ దినోత్సవ విశిష్టతను ఆయన సవివరంగా వివరించారు.

ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉత్సాహంగా పాల్గొంది. ఉపాధ్యాయులు వై. మంజులత, సభావత్ వెంకట్ కుమార్, మీనా కుమారి, అమీనాతో పాటు పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



