|  
FLASH NEWS
Box Office Trend : బాక్సాఫీస్ వద్ద భక్తి పారవశ్యం.. రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న ఇరుముడి, హనుమాన్ అంశ్  •  Indian Army : రూ.46 లక్షల అమెజాన్ ప్యాకేజీ వదిలేసి సైన్యంలోకి.. నువ్వు గ్రేట్ గురూ!  •  వెనక్కి తగ్గిన రాజగోపాల్ రెడ్డి? నకిరేకల్ సీఎం సభకు హాజరు..  •  తెలుగు వర్సిటీ జర్నలిజం విద్యార్థుల వినూత్న ప్రయత్నం.. నేడు ‘గురుదక్షిణ’ కవితా సంకలనం ఆవిష్కరణ  •  Giorgia Meloni : యుద్ధానంతర ఇటలీ చరిత్రలో జార్జియా మెలోనీ అరుదైన రికార్డు.. ప్రధాని మోదీ అభినందనలు  • 
Skip to content

Teachers Day : దామెర భీమనపల్లి పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం.. గురువులకు సత్కారం

teachers day celebrations damera bhimanapalli
teachers day celebrations damera bhimanapalli

మర్రిగూడ, సూర్య న్యూస్ : జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం (National Teachers Day) సందర్భంగా మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లి ఎంపీపీఎస్ (MPPS) పాఠశాలలో గురువులకు ఘన సత్కారం జరిగింది. వడ్డగాని ఇందిరా విద్యాదీపం ఫౌండేషన్ చైర్మన్ వడ్డగాని సాయిరాం సౌజన్యంతో విద్యార్థులు తమ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు.

ఈ కార్యక్రమం ప్రారంభంలో ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రను, ఉపాధ్యాయ దినోత్సవ విశిష్టతను ఆయన సవివరంగా వివరించారు.

ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉత్సాహంగా పాల్గొంది. ఉపాధ్యాయులు వై. మంజులత, సభావత్ వెంకట్ కుమార్, మీనా కుమారి, అమీనాతో పాటు పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp