
హైదరాబాద్, సూర్య న్యూస్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) పరిధిలోని పలు గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పార్ట్ టైమ్ టీచర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు 2026-27 విద్యా సంవత్సరానికి (Academic Year) గానూ ఒప్పంద ప్రాతిపదికన పూర్తి తాత్కాలిక పద్ధతిలో జరగనున్నాయి. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని మేడ్చల్ బాలికల గురుకులం, జగద్గిరిగిరిగుట్ట బాలికల గురుకులం, మల్కాజ్గిరి ఫైన్ ఆర్ట్స్ కో-ఎడ్ గురుకులం మరియు షామీర్పేట్ బాలుర గురుకులాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. జూనియర్ లెక్చరర్ (Junior Lecturer) మరియు స్పెషల్ టీచర్స్ పోస్టులకు యూజీసీ నిబంధనల ప్రకారం సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీతో పాటు బీఈడీ (B.Ed) అర్హత కలిగి ఉండాలి. అలాగే పీజీటీ, టీజీటీ (PGT/TGT) పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో బీఎస్సీ, బీఏ లేదా బీకాం డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!
తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.
📲 Join WhatsApp Channelఉద్యోగాలకు ఎంపికైన జూనియర్ లెక్చరర్లకు నెలకు రూ.23,400 వేతనం చెల్లిస్తారు. పీజీటీ మరియు టీజీటీ ఉపాధ్యాయులకు నెలకు రూ.18,200 జీతం ఇవ్వబడుతుంది. స్పెషల్ టీచర్ల పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.14,200 వేతనంగా నిర్ణయించారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 01-07-2026 సాయంత్రం 4:00 గంటల వరకు ఆఖరి గడువుగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 02-07-2026 ఉదయం 10:00 గంటల నుండి డెమో (Demo) పరీక్షలు ప్రారంభమవుతాయి. అర్హత గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, విద్యార్హత పత్రాలు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలు మరియు డెమో ప్రక్రియ మేడ్చల్ లోని కిస్తాపూర్ లో గల టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ పాఠశాల (TGSWRS/JC G COE Kistapur, Near Paragon Biscuit Company) వేదికగా జరుగుతాయి. మరింత సమాచారం కొరకు జిల్లా సమన్వయ అధికారిని సంప్రదించవచ్చు.



