|   
🔴 BREAKING NEWS ► AP Job Calendar 2026 : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల అనకాపల్లిని దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు Nalgonda News : చండూరు మార్కెట్ యార్డుకు కన్నం.. 1100 బస్తాల ప్రభుత్వ ధాన్యం లూటీ BJP MP K Laxman : 22ఏ పేరిట వేల కోట్ల దోపిడీ.. సామాన్యుల ఆస్తులపై కాంగ్రెస్ దందా: ఎంపీ లక్ష్మణ్ సంచలనం! Ministry of Education : దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో భారీ మార్పులు.. కేంద్ర విద్యాశాఖ కీలక నివేదిక!
Skip to content

నిజాంపేటలో దోమల దండు: మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నాయకులు

నిజాంపేట: మేడ్చల్ జిల్లా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దోమల సమస్య తీవ్రరూపం దాల్చింది. కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీజేపీ నిజాంపేట సర్కిల్ నాయకులు శనివారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. సర్కిల్ కార్యాలయం లోపల బైఠాయించి అధికారుల తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం​

పలు కాలనీలకు చెందిన మహిళలు, స్థానికులతో కలిసి బీజేపీ నాయకులు కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి వల్లనే పట్టణంలో పారిశుధ్యం క్షీణించిందని, దోమల బెడదతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఫిర్యాదు చేస్తున్నా ఫాగింగ్ చర్యలు చేపట్టడం లేదని వారు మండిపడ్డారు.

హామీ ఇచ్చే వరకు సడలని పట్టు

​కమిషనర్ ఛాంబర్ వద్ద బైఠాయించిన నిరసనకారులు.. దోమల నివారణకు తక్షణమే స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలనీల్లో నెలకొన్న పారిశుధ్య లోపాలను నేరుగా కమిషనర్‌కు వివరించారు. అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుక కూర్చున్నారు.​

కమిషనర్ హామీతో సద్దుమణిగిన నిరసన​

బీజేపీ నాయకుల ఆందోళనతో స్పందించిన మున్సిపల్ కమిషనర్.. సంబంధిత అధికారులతో తక్షణమే రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీల్లో ఫాగింగ్ చేయడంతో పాటు, దోమల నివారణకు పారిశుధ్య చర్యలు వేగవంతం చేస్తామని చెప్పడంతో నాయకులు నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో మూడు డివిజన్ల అధ్యక్షులు ప్రసాద్ రాజు, నరేంద్ర చౌదరి, బిక్షపతి యాదవ్, దళిత మోర్చా రాష్ట్ర నాయకుడు దాసి నాగరాజు, కాసాని సంతోష్, గజ్జల్లి సంతోష్, సంతోష్ గౌడ్, ప్రహ్లాద్, కార్తీక్, అతీష్ బాబు, బీజేవైఎం రాజు తదితరులు పాల్గొన్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp