
న్యూ ఢిల్లీ, సూర్య న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా శాంతి మరియు సామాజిక సమానత్వం చేకూరాలంటే గౌతమ బుద్ధుడు, గురునానక్ దేవ్, స్వామి వివేకానందల వంటి మహనీయుల బోధనలు నేటి సమాజానికి అత్యంత ఆవశ్యకమని సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు.
సమానత్వానికి ప్రతీకగా త్రివేణి సంగమంన్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో (IGNOU) ఇటీవల ఆంగ్లం మరియు పంజాబీ భాషలలో విడుదలైన “ఐకాన్స్ ఫర్ ఈక్వాలిటీ” (Icons For Equality: Buddha, Guru Nanak Dev & Swamy Vivekananda) అనే పుస్తకంపై మార్చి 09న ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ముగ్గురు మహనీయులు వేర్వేరు కాలాల్లో జన్మించినప్పటికీ వారి లక్ష్యం మాత్రం ఒక్కటేనని వివరించారు, ఈ ముగ్గురి బోధనలు భారతీయ సమాజంలో సామాజిక సమానత్వం తీసుకురావడంలో త్రివేణి సంగమం లాంటివని ఆయన అభివర్ణించారు.
సమానత్వానికి ప్రతీకగా త్రివేణి సంగమం
న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో (IGNOU) ఇటీవల ఆంగ్లం మరియు పంజాబీ భాషలలో విడుదలైన “ఐకాన్స్ ఫర్ ఈక్వాలిటీ” (Icons For Equality: Buddha, Guru Nanak Dev & Swamy Vivekananda) అనే పుస్తకంపై మార్చి 09న ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ముగ్గురు మహనీయులు వేర్వేరు కాలాల్లో జన్మించినప్పటికీ వారి లక్ష్యం మాత్రం ఒక్కటేనని వివరించారు, ఈ ముగ్గురి బోధనలు భారతీయ సమాజంలో సామాజిక సమానత్వం తీసుకురావడంలో త్రివేణి సంగమం లాంటివని ఆయన అభివర్ణించారు.

యువతకు స్ఫూర్తిదాయకం
అశాంతితో రగులుతున్న ప్రస్తుత ప్రపంచానికి వీరి శాంతి సందేశాలు దిక్సూచిలా పనిచేస్తాయని ఈ చర్చలో పాల్గొన్న పలువురు మేధావులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు, సామాజిక వివక్షను తొలగించి ఐక్యతను చాటడంలో ఈ పుస్తకంలోని అంశాలు నేటి పరిశోధక విద్యార్థులకు మరియు యువతకు ఎంతో స్ఫూర్తినిస్తాయని వక్తలు పేర్కొన్నారు.
పాల్గొన్న ఇగ్నోటా ప్రతినిధులు మరియు ప్రముఖులు
ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుల సంఘం (ఇగ్నోటా – IGNOUTA) ప్రతినిధులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు, ఇగ్నోటా అధ్యక్షులు ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ గుర్మీత్ కౌర్ పాల్గొని పుస్తక ప్రాముఖ్యతను వివరించారు, అలాగే ఇగ్నోటా జాయింట్ సెక్రటరీ డాక్టర్ కొండే లింగస్వామి, కార్యవర్గ సభ్యులు డాక్టర్ వీరమల్లు శ్రీశైలం, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ సీమా రాణి, సోషల్ వర్క్ ఫ్యాకల్టీ డాక్టర్ బినోద్ కుమార్, డాక్టర్ అశోక్, డాక్టర్ శ్రవణ్ లతో పాటు 30 మందికి పైగా బోధనా సిబ్బంది, పరిశోధక విద్యార్థులు వినోద్ హిందుస్తానీ, కత్తుల ఉపేందర్ తదితరులు పాల్గొని ఈ చర్చను విజయవంతం చేశారు.