
సౌతాంప్టన్, సూర్య న్యూస్ : ఇంగ్లండ్ (England) గడ్డపై టీమిండియా (Team India) పరాజయాల పరంపర కొనసాగుతోంది. శనివారం సౌతాంప్టన్ (Southampton) వేదికగా జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ లోనూ భారత్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ (ICC T20 Rankings) లో ఇంగ్లండ్ అగ్రస్థానానికి చేరుకుంది. భారత జట్టు ఆరు వరుస పరాజయాలను మూటగట్టుకుని తీవ్రంగా నిరాశపరిచింది.
కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సారథ్యంలో ఆడిన 7 మ్యాచ్ లలో భారత్ ఒక్క విజయం కూడా సాధించలేదు. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లండ్ 4-0 తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత్ క్లీన్ స్వీప్ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (Jos Buttler) 64 బంతుల్లో 131 పరుగులతో విధ్వంసకర శతకం సాధించాడు. అలాగే కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) 45 బంతుల్లో 95 పరుగులతో అజేయంగా నిలిచాడు.
భారత బౌలర్లలో శివం దూబే రెండు వికెట్లు తీయగా ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. ఇషాన్ కిషన్ (Ishan Kishan) 56 పరుగులు, తిలక్ వర్మ (Tilak Varma) 53 పరుగులతో హాఫ్ సెంచరీలు సాధించినా జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ (Sam Curran) మూడు వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య జూలై 14 నుంచి మూడు వన్డేల సిరీస్ (ODI Series) ప్రారంభం కానుంది.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




