|   
🔴 BREAKING NEWS ► BRAOU and COL MoU : డిజిటల్ విద్యలో చారిత్రాత్మక ఘట్టం.. కెనడా సంస్థతో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కీలక ఒప్పందం Bhogapuram International Airport : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం.. ఏపీ ముఖచిత్రం మార్చేయనున్న మెగా ప్రాజెక్ట్ ప్రారంభం IBPS Clerk Notification 2026 : నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 11,403 బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలకు ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్ AP Building Rules : భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం ఊరట.. బిల్డింగ్ నిబంధనల్లో కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే BRAOU Online Courses : డిజిటల్ యుగంలోకి అంబేద్కర్ వర్సిటీ.. 4 ఆన్‌లైన్ కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్
Skip to content

AP Government : వారసత్వ భూముల బదలాయింపుపై గుడ్ న్యూస్.. ఇకపై ఆటో మ్యుటేషన్

అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) వారసత్వ భూముల (Ancestral Lands) బదలాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్ (Auto Mutation) విధానాన్ని అమలు చేయనుంది. దీని ద్వారా భూముల రిజిస్ట్రేషన్ (Registration) పూర్తయిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో (Revenue Records) వారసుల పేర్లు ఆటోమేటిక్ గా నమోదు కానున్నాయి.

ఆఫీసుల చుట్టూ తిరిగే బాధలు తప్పినట్లే

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

ఇప్పటివరకు వారసత్వ భూముల మ్యుటేషన్ కోసం ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దరఖాస్తులు, పరిశీలనలు, అనుమతుల ప్రక్రియ కారణంగా తీవ్ర జాప్యం జరిగేది. కొత్త విధానంతో ఈ ఇబ్బందులకు చెక్ పడనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత వివరాలు ఆటోమేటిక్ గా రెవెన్యూ వ్యవస్థలో (Revenue System) అప్‌డేట్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో వారసత్వ హక్కుల బదలాయింపులో పారదర్శకత (Transparency) పెరుగుతుందని, ప్రజలకు సేవలు సులభంగా అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

​రూ.100 కే స్టాంప్ డ్యూటీ

మరోవైపు రూ. 10 లక్షల లోపు విలువైన వారసత్వ భూములకు స్టాంప్ డ్యూటీని (Stamp Duty) కేవలం రూ. 100 గా ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల చిన్న, మధ్య తరహా భూముల వారసులకు ఆర్థిక భారం భారీగా తగ్గనుంది.

FMC తప్పనిసరి

వీలునామా (Will) లేకుండా వారసత్వ భూముల బదలాయింపు జరిగే సందర్భాల్లో రిజిస్ట్రేషన్ సమయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (FMC) తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. దీని ద్వారా అసలైన వారసులను గుర్తించే ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారసత్వ భూముల విషయంలో ఎదురయ్యే జాప్యాలు, అనవసరమైన కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త విధానం ఏపీ భూ పరిపాలనలో (Land Administration) కీలక మార్పుగా అధికారులు భావిస్తున్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp