|  
FLASH NEWS
సూర్య న్యూస్ ఎక్స్‌క్లూజివ్: బంగాళాఖాతంలో మునిగిపోయిన భారీ కార్గో నౌక.. 22 మంది సిబ్బంది గల్లంతు.. రక్షణ చర్యల్లో కోస్ట్ గార్డ్, నేవీ  •  Telangana Auto Strike : ప్రయాణికులకు ఊరట.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమ్మె విరమణ  •  AP Job Calendar 2026 : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల  •  అనకాపల్లిని దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు  •  Nalgonda News : చండూరు మార్కెట్ యార్డుకు కన్నం.. 1100 బస్తాల ప్రభుత్వ ధాన్యం లూటీ  • 
Skip to content

CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్‌పై సీఎం సీరియస్.. హైకమాండ్‌దే ఫైనల్ డెసిషన్

cm-revanth-reddy-konda-surekha-episode.jpg
cm-revanth-reddy-konda-surekha-episode

Hyderabad, Surya News:తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి (CM Revanth Reddy) ఈ విషయంపై సీరియస్ గా దృష్టి సారించారు. పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. క్రమశిక్షణా సంఘం (Disciplinary Committee) ఇచ్చే నివేదిక ఆధారంగా ఏఐసీసీ తదుపరి చర్యలు తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. ఈ సున్నితమైన అంశంపై పార్టీ నేతలు ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు.

కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పారు. ఈ వివాదంపై ఎలాంటి ఊహాజనిత వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. ఇదే సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఈ అంశంపై స్పందించారు. పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలను సరైన వేదికపైనే మాట్లాడుతామని ఆయన స్పష్టం చేశారు. తాను ఈ విషయంపై బహిరంగంగా ఎలాంటి విమర్శలు చేయబోనని ఆయన కుండబద్దలు కొట్టారు.

మరోవైపు పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పటికే ఒక నివేదిక సిద్ధం చేశామని ఆయన వెల్లడించారు. ఆ రిపోర్ట్‌ను అధిష్టానానికి సమర్పించడం వరకే తన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సైతం ప్రాథమిక నివేదికను ఏఐసీసీకి పంపామని తెలిపారు. పార్టీలో ఎవరైనా గీత దాటితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

వారం రోజులుగా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్న కొండా సురేఖ తాజాగా జూమ్ ద్వారా అధికారులతో ఒక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న వనమహోత్సవం ఏర్పాట్లపై ఆమె అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఇదిలా ఉండగా కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్ వ్యవహారంలో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తీక్ లను ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. వీరితో కలుపుకుని ఈ ఓఎస్‌డీ కేసులో అరెస్టయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp