
హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) ప్రాంగణంలో ఉద్యోగుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన (Employees Protest) చేపట్టారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి మరియు తుంటీయ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది.
ప్రధాన డిమాండ్లు ఇవే..
పెండింగ్ లో ఉన్న పీఆర్సీకి వెంటనే ఆమోదం తెలపాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. అలాగే పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు అందించేలా హెల్త్ కార్డులు జారీ చేయాలి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు నినాదాలు చేశారు.

నిరసనలో పాల్గొన్న ముఖ్య నాయకులు..
ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల అధికారులు వెంటనే స్పందించాలని నాయకులు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో తుంటీయ సెక్రటరీ జనరల్ మరియు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కాంతం ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. తుంటియా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యకేష్ దైడా సైతం ఈ ఆందోళనలో భాగస్వాములు అయ్యారు. వీరితో పాటు విశ్వనాథ్, మియాజాని, పాండు, అశోక్, భరత్ రెడ్డి తదితర ఉద్యోగ సంఘాల నాయకులు మరియు సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



