
అమరావతి, సూర్య న్యూస్ : పోలవరం ప్రాంతంలోని గొల్లగుప్ప గ్రామంలో పలువురు గ్రామస్థులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామంలోని ప్రస్తుత పరిస్థితులు, అస్వస్థతకు దారితీసిన కారణాలపై జిల్లా కలెక్టర్, స్థానిక వైద్యాధికారులతో ఆయన నేరుగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధితులందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే, ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకునేందుకు తక్షణమే విచారణ జరపాలని ఆయన స్పష్టం చేశారు.

పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్లో జాయిన్ అవ్వండి! 🎯
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



