|   
🔴 BREAKING NEWS ► Commonwealth Games 2026 : కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సర్ల రికార్డ్, ఖాతాలో మరో రెండు స్వర్ణాలు BRAOU and COL MoU : డిజిటల్ విద్యలో చారిత్రాత్మక ఘట్టం.. కెనడా సంస్థతో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కీలక ఒప్పందం Bhogapuram International Airport : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం.. ఏపీ ముఖచిత్రం మార్చేయనున్న మెగా ప్రాజెక్ట్ ప్రారంభం IBPS Clerk Notification 2026 : నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 11,403 బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలకు ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్ AP Building Rules : భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం ఊరట.. బిల్డింగ్ నిబంధనల్లో కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే
Skip to content

CM Chandrababu Naidu : అమరావతి అంటే ఆ 29 గ్రామాలు మాత్రమే కాదు.. విజయవాడ, గుంటూరు కూడా.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

Amaravati, Surya News: రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. సచివాలయంలో రాజధాని నిర్మాణ పనులపై కాంట్రాక్ట్ సంస్థలు, అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక సూచనలు చేశారు. అమరావతి అంటే కేవలం 29 గ్రామాల సమూహం మాత్రమే కాదని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ, గుంటూరు నగరాలను కూడా కలుపుకుని సమగ్ర రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఆయన తెలిపారు. అమరావతి అభివృద్ధి ప్రణాళికలో (Development Plan) విజయవాడ, గుంటూరు నగరాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

రాజధానిలో ప్రస్తుతం 95 ప్రాజెక్టులకు సంబంధించి రూ.50,999 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ పనుల్లో ప్రతి నెల కనీసం 7.92 శాతం పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. నిర్ణయించిన గడువులోగా ప్రతి ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో స్పీడ్, క్వాలిటీ, డెలివరీ ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని ఆయన అన్నారు. ఇప్పటికే పనుల వేగం కొంత పెరిగినా ఇంకా మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. రాజధాని నిర్మాణం చేపట్టడం నిర్మాణ సంస్థలకు ఒక గొప్ప అవకాశం అని చెప్పారు. ఆ అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.

ప్రభుత్వం నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు. అందువల్ల పనుల్లో ఆలస్యం జరిగే పరిస్థితి ఉండకూడదని హెచ్చరించారు. భూసేకరణ, నిధుల సమీకరణ, అనుమతులు, డిజైన్ల ఆమోదం వంటి అంశాల్లో అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు కూడా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కరించి పనులు ఆగకుండా చూడాలని సూచించారు. రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనం పెంపు, ఆధునిక మౌలిక వసతుల అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనులను ఇకపై తాను కూడా స్వయంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తయితే ప్రపంచ స్థాయి రాజధానిగా (World Class Capital) అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యం సాధ్యమవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp