
హైదరాబాద్, సూర్య న్యూస్ : టాలీవుడ్లో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ (Prabhas Spirit Movie) సినిమా చుట్టూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు, ప్రముఖ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా (Pranay Reddy Vanga) తాజాగా సినీ విమర్శకులను ఉద్దేశించి చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చిన్న సినిమాలను టార్గెట్ చేయడం సులభమని, దమ్ముంటే తమ రాబోయే భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ను అటాక్ చేయాలంటూ ఆయన విమర్శకులకు బహిరంగ సవాల్ విసిరారు.
ఇటీవల వంగా బ్రదర్స్ నిర్మాణంలో విడుదలైన ‘రోమాంచకం’ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాపై విమర్శకుల రివ్యూలు ప్రతికూల ప్రభావం చూపించాయని ప్రణయ్ అభిప్రాయపడ్డారు. సినిమా తీయడంలో ఉన్న కష్టం ప్రొడక్షన్లో ఉన్నవారికే తెలుస్తుందని, చిన్న చిత్రాలపై సులభంగా విమర్శలు చేయడం తగదని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే “చేతనైతే స్పిరిట్ సినిమా విడుదలయ్యాక దాన్ని అటాక్ చేసి చూడండి.. అప్పుడు చూసుకుందాం” అంటూ ఆయన ఘాటుగా స్పందించారు.
‘స్పిరిట్’పై భారీ అంచనాలు
నిర్మాత చేసిన ఈ సవాల్తో ఒక్కసారిగా ‘స్పిరిట్’ సినిమాపై ఉన్న బజ్ మరింత పెరిగింది. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఇది రెగ్యులర్ కమర్షియల్ పోలీస్ కథ కాదని, కోపం, ఎమోషన్స్, గ్రే షేడ్స్ కలగలిపిన డార్క్ టోన్లో హీరో పాత్ర ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సందీప్ శైలిలో ప్రభాస్ను సరికొత్తగా చూడబోతున్నామని అభిమానులు ఆశిస్తున్నారు.
సందీప్ మార్క్ టేకింగ్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కంటెంట్ చాలా ఇంటెన్స్గా ఉంటుందని, దీనికి కూడా ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉందని మేకర్స్ ఇదివరకే వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రణయ్ చేసిన తాజా కామెంట్స్తో సినిమా విడుదలయ్యాక విమర్శకుల స్పందన ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



