
హైదరాబాద్, సూర్య న్యూస్: ప్రస్తుత సమాజంలో కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) అత్యంత ఆవశ్యకమని, దీనిపై విశ్వవిద్యాలయ అధ్యాపకులు పట్టు సాధించాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సూచించారు. శుక్రవారం విశ్వవిద్యాలయంలో “బాధ్యతాయుత కృత్రిమ మేధస్సు వినియోగం – విద్యా విధానంలో ప్రపంచ దృక్పథం” అనే అంశంపై అధ్యాపకుల కోసం ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, అధ్యాపకులు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించడానికి ఏఐ పరిజ్ఞానం ఎంతో అవసరమని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రత్యేకంగా ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అధ్యాపకులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, నిరంతరం అప్డేట్ అవ్వాలని ఆయన హితవు పలికారు.

ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ఇంటెలిజెంట్ ఆటోమేషన్, ఫైనాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ గుజ్జు మాట్లాడుతూ, ఏఐ ఉద్యోగాలను తొలగించదని, పైగా మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని భరోసా ఇచ్చారు. ఏఐని కేవలం సహాయక సాధనంగా (Assistant tool) మాత్రమే వాడుకుంటూ, ఉత్పాదకతను మరియు సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




