Skip to content

మన్యం వీరుడు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు: కేపిహెచ్‌బిలో ఘనంగా చలివేంద్రం ప్రారంభం

హైదరాబాద్, మార్చి 19, సూర్య న్యూస్ : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి కేపిహెచ్‌బి (KPHB) లో సేవా కార్యక్రమాలు మిన్నంటాయి. అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ‘క్షేత్రియ యూత్ ఫెడరేషన్’ (KYF) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి గొట్టిముక్కల జస్వంత్ రావు (దేశాల్), నార్నె శ్రీనివాస్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి చలివేంద్రం సేవలను బాటసారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

బాటసారుల దాహార్తిని తీరుస్తూ:

📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!

తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.

📲 Join WhatsApp Channel

వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రయాణికులు, పాదచారుల సౌకర్యార్థం ఈ చలివేంద్రాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. తాగునీరు, మజ్జిగను చల్లగా ఉంచేందుకు ఐస్ బాక్సులు, కూలర్లను ఏర్పాటు చేశారు. KYF స్వయంసేవకులు ఎంతో ఉత్సాహంతో వాహనదారుల వద్దకు వెళ్లి స్వయంగా మజ్జిగ పంపిణీ చేయడం విశేషం. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు ఈ పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా సాగింది.

తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ KYF సభ్యులు శ్రీ జగన్ గురూజీని కలిసి ఆశీస్సులు పొందారు. సమాజ సేవలో యువత భాగస్వామ్యం కావడం పట్ల గురూజీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గొట్టిముక్కల జస్వంత్ రావు మాట్లాడుతూ.. విప్లవ వీరుడు అల్లూరి స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. నార్నె శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ఎండల తీవ్రత పెరుగుతున్న తరుణంలో ప్రజల దాహార్తిని తీర్చడం నిజమైన సేవ అని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, వ్యాపారుల మద్దతుతో ఈ కార్యక్రమం అత్యంత విజయవంతమైంది. పారిశుధ్యానికి ప్రాధాన్యతనిస్తూ, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా క్రమశిక్షణతో నిర్వహించిన ఈ చలివేంద్రం అందరి దృష్టిని ఆకర్షించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp