|   
🔴 BREAKING NEWS ► NBK 111 Shooting : కాకినాడ పోర్టులో షూటింగ్.. నందమూరి బాలకృష్ణకు ప్రమాదం.. HYDRA Commissioner : సంచలనం.. హైడ్రా రంగనాథ్ అరెస్ట్ కు హైకోర్టు ఆదేశం Indian Railway Jobs : రైల్వేలో కొలువుల జాతర.. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు బిగ్ నోటిఫికేషన్.. జీతం, అర్హతలు ఇవే Delhi High Court : సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో అక్రమ నిర్బంధం.. హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్ చుక్ భార్య Shocking News : అర్ధరాత్రి రోడ్డుపై నగ్నంగా యువతి పరుగులు – చివరిసారిగా దేవుడికి దండం పెట్టుకుని నేరుగా చెరువులోకి
Skip to content

AP Covid Cases : ఏపీలో మళ్లీ కరోనా కలకలం, నలుగురు మృతితో రాష్ట్ర వ్యాప్తంగా టెన్షన్

అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మళ్లీ కరోనా వైరస్ (Covid-19) చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు 12 కోవిడ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు.

ప్రధానంగా కడప, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో ఈ కొత్త కేసులు నమోదు అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ కోవిడ్ పాజిటివ్ (Covid Positive) వచ్చిన వారిలో నలుగురు మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒకే ప్రాంతంలో క్లస్టర్ గా కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

కోవిడ్ తో మృతి చెందిన నలుగురు వ్యక్తులకు ముందుగానే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. వైరస్ జన్యుక్రమ విశ్లేషణ కోసం 5 నమూనాలను పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు (National Institute of Virology) రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ప్రస్తుతం ముగ్గురు పేషెంట్లు హోమ్ ఐసోలేషన్ లో (Home Isolation) ఉండగా, మరో ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మరో ముగ్గురు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు సమాచారం. జూన్ 26 నుంచి జూలై 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 67 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఎవరూ అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ (Health Department) సూచించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్యులు, ఆసుపత్రులను అప్రమత్తం చేశామని ఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండియన్ తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా జూలై 1 నుంచి 339 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో అత్యధికంగా కేరళ (Kerala) రాష్ట్రంలో 115 కోవిడ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

దేశంలోని పలు నగరాల్లో కోవిడ్ కేసులు బయటపడటంతో మళ్లీ లాక్‌డౌన్ (Lockdown) పరిస్థితులు వస్తాయా అని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 2020 నాటి తీవ్రమైన పరిస్థితులు పునరావృతం అవుతాయా అనే టెన్షన్ ప్రజల్లో కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు మరియు ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp