
నల్గొండ: తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ మైనొద్దీన్ పెద్ద కుమారుడు బందగీ అకాల మరణం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బందగీ భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మైనొద్దీన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చిన్న వయసులోనే బందగీ మృతి చెందడం బాధాకరమని, నిరంతరం ప్రజా, రైతు సమస్యలపై పోరాడే మైనొద్దీన్ కుటుంబానికి ఇది తీరని లోటని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి సహా ఇతర సీపీఐ, రైతు సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు


🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



