|  
FLASH NEWS
ISRO EOS-08 : ఇస్రో మరో అద్భుతం.. నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3  •  బండి సంజయ్ : “15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే.. ఇదా దేశభక్తి?”  •  Janmashtami 2026 : కృష్ణాష్టమి పూజ సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి  •  Konda Surekha : మంత్రి కొండా సురేఖ బర్తరఫ్.. అధికారిక ఉత్తర్వులు జారీ!  •  CM Revanth Reddy : “రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్”.. కేబినెట్ నుంచి బర్తరఫ్ వేళ కొండా సురేఖ సంచలనం!  • 
Skip to content

మునుగోడు అభివృద్ధే నా అభిమతం- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రూ.24.26 కోట్ల రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

మర్రిగూడ/నారాయణపూర్/గట్టుప్పల్: మునుగోడు నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ, గ్రామీణ రవాణా వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యంగా శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా గట్టుప్పల్ మండలం అంతంపేటలో సుమారు రూ.24.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రెండు కీలక రోడ్డు నిర్మాణ పనులకు ఆయన ఘనంగా శంకుస్థాపన చేశారు. నారాయణపూర్ మండలం లచ్చమ్మగూడెం నుండి అంతంపేట వరకు రూ.10.76 కోట్లతో, అలాగే అంతంపేట నుండి మర్రిగూడ మండలం శివన్నగూడెం వరకు రూ.13.50 కోట్లతో నూతన రహదారులను అభివృద్ధి చేయనున్నారు.

2c68a58b 3836 4c41 a857 fcafd034d163

సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన ధ్యేయమని, ఇచ్చిన మాట ప్రకారం మారుమూల గ్రామాలకు సైతం నాణ్యమైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp