|   
🔴 BREAKING NEWS ► TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ Food Adulteration in Hyderabad : మీరు తినేది అన్నమా? విషమా? 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్, నగరంలో వణికిపోతున్న ఫుడ్ మాఫియా Save Telugu University : అక్షరాల గుడిలో ఆక్రమణల పర్వం.. వర్సిటీని కాపాడుకునేందుకు కదిలివచ్చిన విద్యార్థి, మేధావి లోకం! Pakistan Airstrikes : అఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ బాంబుల వర్షం, ఘాటుగా స్పందించిన భారత్ Telangana ACB Raids : తెలంగాణలో ఏసీబీ భారీ వేట.. డీఎస్పీ ఇంట్లో 200 కోట్ల కుబేర గుట్టు రట్టు, దొరికిన డైరీలో సంచలన నిజాలు
Skip to content

ఘనంగా సుదగోని రాజేష్ గౌడ్ 15వ వర్ధంతి వేడుకలు: అమరుడికి నివాళులర్పించిన గౌడ సంఘం నాయకులు

మానకొండూరు, సూర్య న్యూస్: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు సుదగోని రాజేష్ గౌడ్ 15వ వర్ధంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని రాజేష్ గౌడ్ విగ్రహానికి గౌడ సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో స్వీట్లు పంపిణీ చేశారు.

తెలంగాణ ఉద్యమంలో రాజేష్ గౌడ్ త్యాగం మరువలేనిది

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మల్యాల రాములు గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో రాజేష్ గౌడ్ పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు. 2011 మార్చి 18వ తేదీన తెలంగాణ రాష్ట్రం వస్తుందో రాదో అన్న ఆవేదనతో రాజేష్ గౌడ్ ఆత్మబలిదానం చేసుకున్నారని వారు పేర్కొన్నారు. అమరుల త్యాగాల ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, రాజేష్ గౌడ్ వంటి ఉద్యమకారుల త్యాగాలను గౌడ సమాజం ఎప్పటికీ మరువదని వారు కొనియాడారు.

కుటుంబ సభ్యులకు పరామర్శ

ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ తల్లిదండ్రులు సుదగోని వీరస్వామి గౌడ్, నీలమ్మలను నాయకులు పరామర్శించారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ధైర్యం కోల్పోవద్దని భరోసా ఇచ్చారు. ఉద్యమ సమయంలో రాజేష్ గౌడ్ చూపిన చొరవ, ధైర్యం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని నాయకులు ఈ సందర్భంగా మాట్లాడారు.

పాల్గొన్న ముఖ్య నాయకులు

ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల గౌడ సంఘం అధ్యక్షులు రావుల శ్రీనివాస్ గౌడ్, మానకొండూరు నియోజకవర్గ ఇంచార్జ్ గోపాగోని నవీన్ గౌడ్, చెంజర్ల గౌడ సంఘం అధ్యక్షులు సింగం నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. అలాగే సుదగోని చందు గౌడ్, సుదగోని రవి గౌడ్, మూల రాజు, గౌడ సంఘం సభ్యులు, చరణ్ కుమార్ మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని రాజేష్ గౌడ్ అమరత్వానికి నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp