
హైదరాబాద్, సూర్య న్యూస్ : విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) మరియు స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ మధ్య గురువారం కీలక ఒప్పందం జరిగింది. నైపుణ్య ఆధారిత విద్యను (Skill Based Education) అందించేందుకు ఈ అదనపు అవగాహన ఒప్పందం కుదిరినట్లు అధికారులు వెల్లడించారు.
వర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మరియు రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ ఎన్ కిషోర్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. వర్శిటీ స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ పల్లవీ కాబ్డే మరియు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ హరికృష్ణ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందానికి అదనంగా మరిన్ని శిక్షణా కార్యక్రమాలను ఇందులో చేర్చినట్లు వర్శిటీ వీసీ వివరించారు.

ఇప్పటికే నిర్వహిస్తున్న పలు కోర్సులతో పాటు భవిష్యత్తులో మరిన్ని వృత్తి విద్యా కోర్సులను విద్యార్థులకు అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్పా చక్రపాణి మరియు ఈఎంఆర్ఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలమన్ పాల్గొన్నారు. పలు విభాగాల డైరెక్టర్లు మరియు డీన్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



