Skip to content

జీడిమెట్ల గ్రామంలో ఘనంగా స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు.. పూజల్లో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్

జీడిమెట్ల, మార్చి 22 (సూర్య న్యూస్): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర, శివ మరియు వీరాంజనేయ స్వామి వార్ల 22వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకల సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ప్రత్యేక ఆహ్వానం మేరకు బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

స్వామి వార్ల దర్శనం.. ప్రత్యేక పూజలు

📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!

తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.

📲 Join WhatsApp Channel

​బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎంపీ ఈటల రాజేందర్ కు ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికింది. ఆయన స్వామి వార్లను దర్శించుకుని, లోక కల్యాణం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి, ప్రసాదాన్ని అందజేశారు. భక్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఎంపీ ఆకాంక్షించారు.

పాల్గొన్న నేతలు​

ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి కూడా పాల్గొని స్వామి వార్ల కృపకు పాత్రులయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక బీజేపీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ బ్రహ్మోత్సవ వేడుకలలో పాల్గొని స్వామి వార్లను సేవించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp