
హైదరాబాద్, సూర్యా న్యూస్. రాజకీయాల్లో రాణించాలనుకునే యువత నేతల వెనుక తిరుగుతూ సమయం వృథా చేసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు స్పష్టం చేశారు. నాయకుల చుట్టూ తిరగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, అది కేవలం సోషల్ మీడియాలో ఫోటోలు దిగి పోస్ట్ చేసుకోవడానికే పనికొస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.
అలాంటి పనులకు స్వస్తి పలికి, తమ సొంత ప్రాంతాల్లోని నీళ్లు, రోడ్ల వంటి మౌలిక ప్రజా సమస్యలపై ప్రత్యక్షంగా పోరాడాలని యువ కార్యకర్తలకు సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసినప్పుడే అసలైన పాపులారిటీ వస్తుందని, అప్పుడే నిజమైన నాయకులుగా గుర్తింపు సాధిస్తారని ఆయన తేల్చిచెప్పారు.
ఈ వార్తపై మీ స్పందన?

పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్లో జాయిన్ అవ్వండి! 🎯
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



