
కోనసీమ, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం (Liquor), ఇసుకను ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కోనసీమ జిల్లా మాచవరంలో జరిగిన ఒక సభలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎవరైనా ఎంఆర్పీకి మించి మద్యం విక్రయిస్తే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఇసుక కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడా కూడా ఇసుక కొరత రాకుండా స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని అధికారులకు ఆయన సూచించారు.
2027 నాటికి భూ సమస్యల పరిష్కారం
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. 2027 మార్చి నాటికి రాష్ట్రంలోని భూ వివాదాలన్నింటినీ పూర్తిగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పటిష్టంగా భూముల రీసర్వే చేపడుతున్నామని చెప్పారు. అత్యంత పారదర్శకంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



