|  
FLASH NEWS
సూర్య న్యూస్ ఎక్స్‌క్లూజివ్: బంగాళాఖాతంలో మునిగిపోయిన భారీ కార్గో నౌక.. 22 మంది సిబ్బంది గల్లంతు.. రక్షణ చర్యల్లో కోస్ట్ గార్డ్, నేవీ  •  Telangana Auto Strike : ప్రయాణికులకు ఊరట.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమ్మె విరమణ  •  AP Job Calendar 2026 : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల  •  అనకాపల్లిని దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు  •  Nalgonda News : చండూరు మార్కెట్ యార్డుకు కన్నం.. 1100 బస్తాల ప్రభుత్వ ధాన్యం లూటీ  • 
Skip to content

దేశంలో తొలి కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి : తీర్పు చెబుతూ కన్నీరు పెట్టుకున్న న్యాయమూర్తులు

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : సుదీర్ఘకాలంగా అచేతన స్థితిలో ఉన్న ఓ యువకుడికి పాసివ్ యుథనేషియా (నిష్క్రియాత్మక దయా మరణం) ప్రసాదించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అంగీకరిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది, గడచిన 13 సంవత్సరాలుగా పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్‌లో నరకయాతన అనుభవిస్తున్న 31 ఏళ్ల హరీష్ రాణాకు వైద్య సహాయం తొలగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది, 2018 నాటి కామన్ కాజ్ తీర్పును అమలు చేస్తూ దేశంలో కారుణ్య మరణాన్ని అధికారికంగా అనుమతించిన మొట్టమొదటి కేసుగా ఇది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

​ఈ సంచలన తీర్పు పాఠాన్ని కోర్టు హాల్‌లో చదివి వినిపించే సమయంలో సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ పార్థీవాలా మరియు జస్టిస్ కేవీ విశ్వనాథన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు, ఒక దశలో జస్టిస్ పార్థీవాలా గొంతు పెగల్లేక కన్నీరు పెట్టుకుని గద్గద స్వరంతో మాట్లాడారు, హరీష్‌కు ఇన్నాళ్లుగా అందిస్తున్న లైఫ్ సపోర్ట్ లేదా వైద్య సహాయాన్ని తొలగించడం పూర్తిగా మానవతా దృక్పథంతో కూడిన చర్య అని మరియు ఇది చట్టబద్ధంగా ఆమోదయోగ్యమేనని న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp