
న్యూ ఢిల్లీ, సూర్య న్యూస్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హరీష్ రాణా (Harish Rana) ఉదంతం విషాదాంతమైంది, గత 13 ఏళ్లుగా నూటికి నూరు శాతం కోమాలో (Vegetative State) ఉన్న హరీష్ రాణా (32) మంగళవారం ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS Delhi) ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు, కోలుకునే అవకాశం లేని హరీష్కు కారుణ్య మరణం (Passive Euthanasia) ప్రసాదించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవల చారిత్రాత్మక తీర్పునిచ్చిన నేపథ్యంలో వైద్యులు లైఫ్ సపోర్ట్ను దశలవారీగా తొలగించగా ఆయన కన్నుమూసినట్లు ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి.

దేశంలోనే ఇలాంటి కేసులో అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం, 2013లో తన ఇంట్లోని నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో హరీష్ రాణా తీవ్రమైన తల గాయాల పాలై అప్పటి నుంచి కోమాలోకి వెళ్ళిపోయారు, కేవలం కళ్ళు మాత్రమే తెరిచే స్థితిలో ఉన్న హరీష్ కనీసం నీటిని కూడా స్వయంగా మింగలేక గొట్టాల ద్వారా ఆహారం తీసుకునేవారు, తన కుమారుడి పరిస్థితిని చూసి తల్లడిల్లిన తండ్రి కారుణ్య మరణానికి అనుమతించాలని కోర్టును ఆశ్రయించగా మెడికల్ బోర్డ్ రిపోర్ట్ ఆధారంగా న్యాయస్థానం పచ్చజెండా ఊపింది, ఈ క్రమంలో ఎయిమ్స్ ప్రత్యేక వైద్య బృందం హరీష్కు అందిస్తున్న కృత్రిమ శ్వాసను క్రమంగా నిలిపివేయడంతో 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ముగిసింది.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




