Skip to content

Supreme Court of India : ఇద్దరు లేడీ ఆఫీసర్ల ఫైటింగ్.. ఎట్టకేలకు సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం!

Hyderabad, Surya News:కర్ణాటక (Karnataka) కేడర్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరి (IAS Rohini Sindhuri), ఐపీఎస్ ఆఫీసర్ రూప దివాకర్ (IPS Roopa Divakar) మధ్య జరుగుతున్న వివాదం పై సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా (Supreme Court of India) కీలక నిర్ణయం తీసుకుంది. ఒకరిపై మరొకరు పరువు నష్టం (Defamation) దావా వేసుకోవడంతో ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం వారిద్దరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇద్దరూ అద్భుతమైన ఆఫీసర్లు అని, అనవసరంగా ఒకరి కెరీర్ ని ఇంకొకరు నాశనం చేసుకుంటున్నారని కోర్టు పేర్కొంది.

Supreme Court of India : మధ్యవర్తిగా రిటైర్డ్ జస్టిస్ నియామకం

​గత 2023 లో ఐఏఎస్ రోహిణి సింధూరి అవినీతికి (Corruption) పాల్పడుతోందని ఐపీఎస్ రూప తీవ్ర ఆరోపణలు చేశారు. రోహిణి తన ప్రైవేట్ ఫోటోలను సీనియర్ మేల్ ఆఫీసర్లకు పంపుతూ చట్ట వ్యతిరేక పనులు చేస్తుందని సోషల్ మీడియాలో (Social Media) కొన్ని ఫోటోలను రూప లీక్ చేశారు. దీనితో రూపపై రోహిణి పరువు నష్టం దావా వేశారు. అదే సమయంలో రోహిణిపై కూడా రూప డిఫమేషన్ (Defamation) కేసు వేశారు. ఈ రెండు పిటిషన్ల పై నేడు విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా (Supreme Court of India) ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఒక ముందడుగు వేసింది. రిటైర్డ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ ని (Justice Kurian Joseph) ఈ కేసుకు మధ్యవర్తిగా (Mediator) నియమిస్తూ తీర్పు వెలువరించింది.

మరిన్ని తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ మరియు వివరణాత్మక కవరేజ్ కోసం Surya News WhatsApp Channel లో చేరండి 👇

మీ అభిప్రాయం తెలియజేయండి.