|   
🔴 BREAKING NEWS ► BJP MP K Laxman : 22ఏ పేరిట వేల కోట్ల దోపిడీ.. సామాన్యుల ఆస్తులపై కాంగ్రెస్ దందా: ఎంపీ లక్ష్మణ్ సంచలనం! Ministry of Education : దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో భారీ మార్పులు.. కేంద్ర విద్యాశాఖ కీలక నివేదిక! Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే
Skip to content

CM Revanth Reddy : తెలంగాణ రైతులకు ఉగాది కానుక: సాదా బైనామా సమస్యలకు చెక్.. 22న రైతు భరోసా జమ

​హైదరాబాద్, సూర్య న్యూస్ :తెలంగాణలోని అన్నదాతలకు ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ ఊరటనిచ్చే ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొన్న సాంకేతిక మరియు చట్టపరమైన ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భూ భారతి కార్యక్రమం ద్వారా భూ రికార్డులన్నింటినీ సమగ్రంగా ప్రక్షాళన చేసి, సాదా బైనామా భూములపై రైతులకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనివల్ల లక్షలాది మంది రైతులకు తమ భూములపై ధీమా కలగనుంది.

మరోవైపు రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. మొదటి విడతలో భాగంగా ఎకరా లోపు భూమి ఉన్న సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ, 3,590 కోట్లు నేరుగా జమ కానున్నాయి. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ఏడాదికి రెండు విడతల్లో కలిపి రూ, 12,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే ఈ పథకం కింద ప్రభుత్వం రూ, 18,000 కోట్లు వెచ్చించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. సాదా బైనామా పరిష్కారం మరియు పెట్టుబడి సాయం ఒకేసారి అందుతుండటంతో ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp