
హైదరాబాద్, సూర్య న్యూస్ :రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా జూన్ 23న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్ కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఏబీవీపీ (ABVP) కూకట్ పల్లి విభాగ్ కన్వీనర్ రేగోడ్ నాగేష్ మీడియా సమావేశంలో బంద్ వివరాలను వెల్లడించారు.
రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) దాదాపు 23 వేల బడులను మూసివేసి కేవలం 4 వేలకు కుదించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ చర్యల వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల ఉన్న సవతి తల్లి ప్రేమను బట్టబయలు చేసిందని మండిపడ్డారు.
📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!
తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.
📲 Join WhatsApp Channelఫీజుల దోపిడీని అరికట్టడంలో విఫలమైన ముఖ్యమంత్రి (CM Revanth Reddy) కార్పొరేట్ మాఫియాకు అంబాసిడర్ గా మారారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే తన తీరు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ విద్యా సంక్షోభానికి వ్యతిరేకంగా జూన్ 23న జరిగే పాఠశాలల బంద్ కు (Schools Bandh) ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పూర్తిగా సహకరించాలని నాగేష్ కోరారు.



