Skip to content
Home » ప్రభుత్వ ప్రహరీనే పునాదిగా చేసి భారీ కబ్జాకు స్కెచ్: చందానగర్ లో రంగంలోకి దిగిన హైడ్రా ఏం చేసిందంటే

ప్రభుత్వ ప్రహరీనే పునాదిగా చేసి భారీ కబ్జాకు స్కెచ్: చందానగర్ లో రంగంలోకి దిగిన హైడ్రా ఏం చేసిందంటే

శేరిలింగంపల్లి మండలం చందానగర్ పరిధిలోని భవానీపురంలో సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన 400 గజాల పార్కు స్థలాన్ని కబ్జాదారుల నుంచి హైడ్రా అధికారులు సకాలంలో స్పందించి కాపాడారు.

జీహెచ్ఎంసీ ప్రహరీనే పునాదిగా చేసి కబ్జాకు స్కెచ్భవానీపురం కాలనీలోని 400 గజాల పార్కు స్థలం చుట్టూ గతంలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రహరీ నిర్మించి హద్దులు నిర్ధారించారు, అయితే కొందరు ఆక్రమణదారులు ఆ ప్రభుత్వ ప్రహరీనే పునాదిగా మార్చుకుని ఏకంగా అందులోనే ఇల్లు కట్టడానికి ప్రయత్నించారు, తమ కాలనీలోని పార్కు స్థలం కబ్జాకు గురవుతోందని గమనించిన భవానీపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వెంటనే స్పందించి హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన హైడ్రా: ఫెన్సింగ్ మరియు బోర్డుల ఏర్పాటుస్థానికుల ఫిర్యాదు అందుకున్న వెంటనే హైడ్రా బృందం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది, అధికారిక లేఅవుట్ ప్రకారం అది పార్కు స్థలమేనని పక్కాగా నిర్ధారించుకున్న తర్వాత మంగళవారం నాడు ఆక్రమణలను పూర్తిగా తొలగించింది, అనంతరం ఆ 400 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి ఇది ప్రభుత్వ పార్కు స్థలం అని తెలుపుతూ హైడ్రా హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసింది, సకాలంలో స్పందించి విలువైన పార్కును కాపాడిన అధికారులకు కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *